Don't Miss!
- News కర్ణాటకలో నేడు పోలింగ్ జరిగే లోక్సభ నియోజకవర్గాలు ఇవే
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రవితేజ ‘పవర్’...నోటంకి నోటంకి సాంగ్ (ట్రైలర్స్)
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా రాక్ లైన్ ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్పై కె.ఎస్.రవీంద్ర(బాబీ)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టెనర్ ‘పవర్'. హన్సిక, రెజీనా హీరోయిన్లు. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్గా విడుదలవుతోంది. ఈ చిత్రం పెద్దలకు మాత్రమే అంటూ...‘ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డ్.
విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సినిమాను వివిధ రకాలుగా ప్రమోట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఆడియోలో రవితేజ పాడిన పాపులర్ పాట ‘నోటంకి నోటంకి' వీడియో సాంగుకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. రవితేజ హీరో కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సందర్భంగా నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ మాట్లాడుతూ ‘రవితేజ హీరోగా రవీంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ‘పవర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ‘ఎ'సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. చాలా అద్భుతంగా ఈ సబ్జెక్టుని హ్యాండిల్ చేసి ఒక పవర్ ఫుల్ మూవీగా తీర్చి దిద్దారు దర్శకుడు. థమన్ అందించిన సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఇప్పటికే ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా రవితేజ పాడిన ‘నోటంకి..నోటంకి' సాంగ్ సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు అని తెలిపారు.
తప్పకుండా ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. థమన్ మ్యూజిక్ ఆల్రెడీ పెద్ద హిట్ అయింది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియోని మించిన హిట్ అవుతుందన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది' అన్నాడు దర్శకుడు. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సంపత్ రాజ్, అజయ్, సురేఖావాణి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజీ, జీవా, సుబ్బరాజు, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, జయలక్ష్మి, వినయ్ ప్రసాద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్. థమన్, సినిమాటోగ్రఫీ: జయనన్ విన్సెంట్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్: గౌతం రాజు, స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి, మోహన్ కృష్ణ, ఆర్ట్: బ్రహ్మకడలి, మాటలు: కోన వెంకట్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జె.బి.కృష్ణ, చీఫ్ కోడైరెక్టర్: ఎస్.సురేష్ కుమార్, నిర్మాత: రాక్ లైన్ వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర(బాబీ).