Don't Miss!
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Sports RCB vs KKR: దాన్ని నైట్ రైడర్స్ బ్రేక్ చేయగలదా?
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్కు మళ్ళీ జీఎస్టీ షాక్.. 'ఏఎంబి సినిమాస్'కు నోటీసులు, అడ్డగోలుగా ప్రేక్షకుల నుంచి!
టాలీవుడ్ లో టాప్ హీరోగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నాడు. గత ఏడాది డిసెంబర్ 2న గచ్చిబౌలిలో మహేష్ బాబు తన ఏఎంబి సినిమాస్ మల్టిఫ్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఏఎంబి సినిమాస్ లాంచ్ అయింది. తక్కువ సమయంలోనే ఏఎంబి సినిమాస్ కు పాపులారిటీ పెరిగింది. వరుసగా టాలీవుడ్ సెలెబ్రిటీలు ఏఎంబి సినిమాస్ ని విజిట్ చేసి అందులోనే అత్యాధునిక సౌకర్యాలకు ఆశ్చర్యపోయారు. తాజాగా ఏఎంబి సినిమాస్ వివాదంలో చిక్కుకుంది.
అత్యాధునిక హంగులతో
హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభం అయింది. మహేష్ బాబు ఎంఎబి సినిమాస్ లో కీలక భాగస్వామిగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టిప్లెక్స్ లాంచ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. ప్రేక్షకుల సందడి పెరిగింది. ఈ మల్టిప్లెక్స్ కి వెళ్లాలనుంటే చేతులో డబ్బు కూడా బాగానే ఉండాలి.
జీఎస్టీ షాక్
కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు టాక్స్ విషయంలో జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జీఎస్టీ అధికారులు ఏఎంబి సినిమాస్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనల్ని అతిక్రమించిన నేపథ్యంలో ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
కారణం ఇదే
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో 28 శాతంగా ఉన్న జిఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు జనవరి 1 నుంచి అమలయ్యాయి. కానీ ఏఎంబి సినిమాస్ మాత్రం పాత నిబంధనలతోనే ప్రేక్షకులకు అధిక ధరకు టికెట్ విక్రయిస్తున్నట్లు తెలిసిందే. దీనితో విచారణకోసం జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ అధికారులు ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఏషియన్ గ్రూప్ కూడా భాగస్వామిగా ఉంది.
మహర్షి సినిమాతో
ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు మహర్షి చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ సైలెంట్ గా జరిగిపోతోంది. వంశీ పైడిపల్లి దర్శత్వంలో ఈ చిత్రం చక్కటి సందేశాత్మక అంశాలతో తెరకెక్కుతోంది. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహకాలు చేస్తున్నారు.