Don't Miss!
- Sports ఆ రూల్ మా కొంపముంచింది- రుతురాజ్
- News మే 1 నుంచి ఈ రాశులకు అఖండ ధనయోగం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఇక ఇప్పుడు ఆ అధ్బుత చిత్రం రంగుల్లోకి!?
మాయాబజార్ చిత్రం రంగుల్లోకి మార్చి సక్సెస్ కొట్టడంతో తాజాగా మూగ మనసులు చిత్రాన్ని కూడా రంగుల్లోకి మార్చటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఈ ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. క్కనేని, సావిత్రి, జగ్గయ్య, జమున, పద్మనాభం వంటివారు నటించిన ఈ చిత్రంలో అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పటికీ పునర్జన్మ కాన్సెప్టులకు రిఫెరెన్స్ గా కనపడుతోంది. ఈ చిత్రం ప్రేరణతో అప్పట్లో రాఘవేంద్రరావు జానికి రాముడు చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. నాగార్జన, విజయశాంతి, మోహన్ బాబు నటించారు. ఇక ఈ రకంగా కలర్స్ అద్దడంతో పెట్టే ఖర్చులో మేజర్ షేర్ శాటిలైట్ రైట్స్ ద్వారా రావటం కూడా ఈ ప్రయత్నానికి ఊతం ఇస్తోంది. ఎందుకంటే మాయాబజార్ చిత్రానికి రెండు కోట్ల డబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కలర్ చేస్తే కోటి పై చిలకు శాటిలైట్ రైట్స్ పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే పాతాళ భైరవి, గుండమ్మ కథ వంటి మరిన్ని ఆ పాత మధురాలు రంగులతో మళ్ళీ బాక్సాఫీస్ ని కళకళ్ళాడిస్తాయనటంలో సందేహం లేదు.