twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక ఇప్పుడు ఆ అధ్బుత చిత్రం రంగుల్లోకి!?

    By Srikanya
    |

    మాయాబజార్ చిత్రం రంగుల్లోకి మార్చి సక్సెస్ కొట్టడంతో తాజాగా మూగ మనసులు చిత్రాన్ని కూడా రంగుల్లోకి మార్చటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఈ ప్రయత్నంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. క్కనేని, సావిత్రి, జగ్గయ్య, జమున, పద్మనాభం వంటివారు నటించిన ఈ చిత్రంలో అప్పట్లో సంచలన విజయం నమోదు చేసింది. ఇప్పటికీ పునర్జన్మ కాన్సెప్టులకు రిఫెరెన్స్ గా కనపడుతోంది. ఈ చిత్రం ప్రేరణతో అప్పట్లో రాఘవేంద్రరావు జానికి రాముడు చిత్రం రూపొందించి హిట్ కొట్టారు. నాగార్జన, విజయశాంతి, మోహన్ బాబు నటించారు. ఇక ఈ రకంగా కలర్స్ అద్దడంతో పెట్టే ఖర్చులో మేజర్ షేర్ శాటిలైట్ రైట్స్ ద్వారా రావటం కూడా ఈ ప్రయత్నానికి ఊతం ఇస్తోంది. ఎందుకంటే మాయాబజార్ చిత్రానికి రెండు కోట్ల డబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి కలర్ చేస్తే కోటి పై చిలకు శాటిలైట్ రైట్స్ పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్రెండ్ ఇలానే కొనసాగితే పాతాళ భైరవి, గుండమ్మ కథ వంటి మరిన్ని ఆ పాత మధురాలు రంగులతో మళ్ళీ బాక్సాఫీస్ ని కళకళ్ళాడిస్తాయనటంలో సందేహం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X