Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్ ఆత్మ డబుల్ గేమ్ ఆడదు, ఇది రెడ్డి ఆడుతున్న నాటకం: ఆర్జీవీ
లక్ష్మీస్ వీరగ్రంధం సినిమాపై ఎన్టీఆర్ ఆత్మసందేశం ఇచ్చినట్లు ఓ వీడియో విడుదలైంది. దీనిపై వర్మ స్పందించారు. ఇది ఎన్టీఆర్ నిజమైన సందేశం కాదని, ఫేక్ అని, దీన్ని నమ్మవద్దని అన్నారు.
మహా నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద పోటా పోటీగా బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ తీస్తున్న బయోపిక్ ఎలాంట వివాదాలు లేకుండా తెరకెక్కుతుండగా..... రామ్ గోపాల్ వర్మ, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీయబోతున్న చిత్రాలు వివాదాస్పద అంశాలతో ఉంటాయని తెలుస్తోంది.
వర్మ తీస్తున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్', కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తీస్తున్న 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ఇందులో ఒకటి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతికి అనుకూలంగా, మరొకటి లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా ఉంటాయని తెలుస్తోంది.
పోటా పోటీగా ఎన్టీఆర్ ఆత్మ వీడియోలు
ఎన్టీఆర్ ఆత్మ రూపంలో తనతో మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు అంటూ....కొన్ని రోజుల క్రితం రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ వాయిస్తో ఓ వీడియో రీలీజ్ చేశారు. వర్మకు పోటీగా ఇపుడు కేతిరెడ్డి కూడా ఓ వీడియో విడుదల చేశారు.
ఎన్టీఆర్ ఆత్మ డబుల్ గేమ్ ఆడదు అంటున్న వర్మ
కేతిరెడ్డి విడుదల చేసిన వీడియోపై రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఎన్టీఆర్ గారి ఆత్మ ఇలా నా మధ్య, కేతిరెడ్డి మధ్య డబుల్ గేమ్ ఆడుతుందని నేను కలలో కూడా అనుకోలేను... అంటూ వర్మ వ్యాఖ్యానించారు.
ఇది రెడ్డీ ఆడుతున్న ట్రిపుల్ గేమ్
ఇది ఒక మిమిక్రి ఆర్టిస్టుతో రెడ్డీ ఆడుతున్న ట్రిపుల్ గేమ్. ఈ వీడియోను ఎవరూ నమ్మ వద్దు అంటూ... వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు సందేశం పంపారు.
కేతిరెడ్డి వీడియోలో ఏముంది?
"మాకు అభిమాన పాత్రుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిగారు, మామీద అపారమైన గౌరవంతో, అభిమానంతో, ప్రేమతో మా మీద చలన చిత్రాన్ని నిర్మించాలని సంకల్పించారు. అందరికీ తెలసు మా జీవితం తెరచిన పుస్తకం అని, అందులో కొన్ని తెరవని పుటలను, తెలియని సంఘటనలను, తెరవాలని, ప్రజల ముందు పరవాలని, మంచి సంకల్పంతో ఇంతటి బృహత్తర కార్యాన్ని తలపెట్టారు. ఇంత వరకు బొమ్మ మాత్రమే తెలిసిన మా జీవితంలోని మరో కోణం బొరుసును ఆవిష్కరించే వారి ప్రయత్నాన్ని మీరు అడ్డుకోవాలని ప్రయత్నించడం అవివేకం. మాకు ఏ మాత్రం ఆమోద యోగ్యం కాదు. కనుక మా ఆదేశం శివరసా వహించి ఈ దేశానికి మాజీవితంలోని అన్ని కోణాలు తెలిసేలా వారికి సహకరించండి. ఇది సర్వజన సమ్మతం, ఇదే మా ఆదేశం"... అని ఎన్టీఆర్ సందేశం ఇచ్చినట్లు కేతిరెడ్డి విడుదల చేసిన వీడియోలో ఉంది.
లక్ష్మీ పార్వతి సహకరిస్తుంది
"మై డియర్ జగదీశ్వర్ రెడ్డిగారు మీరు తీయబోయే సినిమా కథాంశం మాకు అద్భుతంగా నచ్చింది. శ్రీమతి లక్ష్మీ పార్వతికి నేను చెప్పాను. ఆమె మహాసాధ్వి, గొప్ప ఇల్లాలు. ఈ సినిమా విషయంలో ఆమె మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. ముందుకు వెళ్లండి. చరిత్ర తిరగరాయండి. మా ఆత్మహ మీ వెన్నంటే ఉంటుంది." అని ఎన్టీఆర్ ఆత్మ సందేశం ఇచ్చినట్లు ఉంది.