Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
జూ ఎన్టీఆర్ అభిమానులుకు శుభవార్త
వివి వినాయిక్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన అదుర్స్ చిత్రం సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఈ విషయాన్ని నిర్మాత కొడాలి నాని మీడియాకు తెలియచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్ లో రూపొందిన మరో సెన్సేషనల్ మూవీ 'అదుర్స్' అనీ, 'సాంబ' తర్వాత తమ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక విలువలతో ఎక్కడా రాజీపడకుండా నిర్మించామనీ చెప్పారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టయిందన్నారు. అన్ని ఏరియాల నుంచి ఆడియోకి రిపీట్ ఆర్డర్స్ వస్తున్నాయని తెలిపారు. జనవరి రెండో వారంలో సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.
దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో 'ఆది', 'సాంబ' చిత్రాల తర్వాత 'అదుర్స్' హ్యాట్రిక్ ఫిలిం అవుతుందన్నారు. ఎన్టీఆర్ మినహా ఎవరూ 'అదుర్స్'లోని రెండు పాత్రలు చేయలేరనీ, ఎన్టీఆర్ నటన అదుర్స్ అనిపించేలా ఉంటుందనీ చెప్పారు. ఈ చిత్రం తప్పనిసరిగా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం తనకుందని అన్నారు.
ఒక మంచి కాంబినేషన్ లో ఈ సినిమాను తమ బ్యానర్ లో చేయడం హ్యాపీగా ఉందని నిర్మాత వల్లభనేని వంశీ పేర్కొన్నారు. ఈ సంక్రాంతికి పెద్ద విజయం సాధించడానికి 'అదుర్స్' చిత్రం రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తోందని అన్నారు.
ఎన్టీఆర్ సరసన నయనతార, షీలా హీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో మహేష్ మంజ్రేకర్, సాయాజీ షిండే, నాజర్, ఆశిష్ విద్యార్థి, ఎమ్మెస్ నారాయణ, వేణుమాధవ్, రఘబాబు, తనికెళ్ల భరణి, రమాప్రభ, రాజ్యలక్ష్మి ఇతర పాత్రలు పోషిస్తున్నారు.కోన వెంకట్ కథ-మాటలు, చంద్రబోస్ పాటలు, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, ఆనందసాయి ఆర్ట్, స్టన్ శివ-రామ్ లక్ష్మణ్ ఫైట్స్, గౌతంరాజు ఎడిటింగ్, దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.