Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాబాయ్ సినిమాకు పేపర్లు ఎగరేసా..ఎన్టీఆర్
అప్పట్లో బాలయ్య బాబాయ్ సినిమాను జనం మధ్యలో కూర్చొని చూస్తూ పేపర్లు చింపి ఎగరేస్తూ తెగ అల్లరి చేసే వాణ్ని. అయినా ఏది ఏమైనా సినిమా చూస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే చూడాలి అంటున్నాడు ఎన్టీఆర్ తన చిననాటి రోజులను తలుచుకుంటూ. ఎన్టీఆర్ హీరోగా వివి వినాయిక్ రూపొందించి 'అదుర్స్'చిత్రం సంక్రాంతికి రిలీజై మంచి టాక్ తెచ్చుకుంది. అలాగే 'అదుర్స్' ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకని ఇటీవల హైదరాబాద్లో ప్రేక్షకుల మధ్య నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మాటల్లోనే..."ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కేవలం అభిమాన బంధంతో నన్ను ఇంతలా ఆదరిస్తున్న మీ రుణం ఏ జన్మలో తీర్చుకుంటానో? ఈ కేరింతలు కోసమే రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. 'అదుర్స్'తో నా ఆకలి తీరింది. ఇన్నాళ్లు ఎదురు చూసిన మీ ఆకలి కూడా తీరిందనుకుంటున్నాను. మా వినాయక్ అన్నతో హ్యాట్రిక్ కొట్టాను. ఇది..ఒక హ్యాట్రిక్తో ఆగదు. కనీసం పది హ్యాట్రిక్లైనా చేస్తామ"న్నారు. ఈ కార్యక్రమంలో వివి వినాయక్, వల్లభనేని వంశీమోహన్, కొడాలి నాని, నల్లమలుపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.