Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఎన్టీఆర్ ‘బాద్ షా’ ఆడియో ఎప్పుడంటే...
హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం ఆడియో విడుదల మార్చి మొదటి వారంలో భారీగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చిత్రం విడుదలను వేసవిలో పెడుతున్నారు. ఈ చిత్రానికి తమన్ అందించే సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ముఖ్యంగా చిత్రం రీరికార్డింగ్ సినిమాలో ప్రత్యేకాంసంగా చెప్పుకునేలా ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతోంది.
మరో ప్రక్క ఈ చిత్రం బిజినెస్ హాట్ హాట్ గా జరుగుతోంది. ఈ విషయమై నిర్మాత బండ్ల గణేష్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక ఇప్పటికే నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షా కి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు. సెంటిమెంట్ గా ప్రారంబించిన దీనికి నామినల్ అడ్వాన్స్ ఆ ఏరియా నుంచి వచ్చింది.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని, ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ, కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్,దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.