Don't Miss!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- News దేశంలో ఫస్ట్ టైమ్, పోలీసులకు ఏసీ హెల్మెట్లు, ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పండగే పండగ !
- Sports LSG vs CSK: రూ. కోట్లు పలికిన ఆ ఇద్దరిని తప్పించాం- రుతురాజ్
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫోటోలు: వాల్మీకి వచ్చే వరకు బాలయ్యకు తిప్పలు తప్పలేదుగా!
Recommended Video
తన తండ్రి ఎన్టీఆర్ జీవిత గాధని వెండి తెరపై ఆవిష్కరిస్తానని గత ఏడాదే బాలయ్య సంచలన ప్రకటన చేసారు. బాలయ్య ఈ ప్రకటన చేసినప్పటి నుంచి సినీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్టీఆర్ జీవితంతో అనేక రాజకీయ అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. అనేక వివాదాలు ఉన్నాయి. వాటన్నిటిని బాలయ్య ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు అంటూ ఆసక్తికరంగా అంతా చర్చించుకుంటున్నారు. నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో తానేంటో తిరిగి నిరూపించుకున్న దర్శకుడు తేజకు బాలయ్య ఈ చిత్ర పగ్గాలు అప్పగించారు. బాలయ్య సరైన దర్శకుడినే ఎంపిక చేసుకున్నారు అని అంతా భావించారు. ఇటీవల ఎన్టీఆర్ చిత్రం ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం అయింది. ఆ తరువాత తాను ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటించడంతో ఎన్టీఆర్ బయోపిక్ కు చిక్కులు మొదలయ్యాయి.
అన్నగారి చరిత్ర
అన్నగారి చరిత్ర గురించి తెలుసుకోవడం తెలుగువారికి అత్యంత ఆసక్తికరమైన అంశమే. కానీ ఎన్టీఆర్ జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించాలంటే అనేక చిక్కుముడులు దాటుకుని కథ సిద్ధం చేసుకోవాలి.
అప్పటి వరకు ఒకే
ఎన్టీఆర్ సినీజీవితం మొత్తం అప్రతిహతంగా జైత్ర యాత్ర కొనసాగింది. రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగునాట తిరుగులేని విజయం సాధించారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆ తరువాతే ఎన్టీఆర్ జీవితంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి.
దర్శకుడు ఎవరు
ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించిన తరువాత బాలయ్య చాలా కాలం సరైన దర్శకుడి కోసం ఎదురుచూశారు. చివరకు తేజని ఎంపిక చేశారు. తేజ అనేక కసరత్తులు చేసి కథ ఓ కొలిక్కి వస్తున్న తరుణంలో ఘనంగా ప్రారంభోత్సవ వేడుక జరిగింది.
బాలయ్యతో విభేదాలు
ఎన్టీఆర్ బయోపిక్ లో కథని ఎక్కడ నుంచి ప్రారంభించి ఎక్కడికి ముగించాలి, ఆయన జీవితంలో జరిగిన అన్ని ముఖ్యమైన అంశాలు ప్రస్తావించాలా వంటి క్రియేటివ్ డెసిషన్స్ లో తేజ, బాలయ్య మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే ఈ చిత్రను నుంచి తప్పుకుంటున్నట్లు తేజ ప్రకటన చేశారు.
అనేక ఉహాగానాలు
తేజ తప్పుకున్న తరువాత బాలయ్యకు మళ్ళీ చిక్కులు మొదలయ్యాయి. సరైన దర్శకుడి కోసం వేట ప్రారంభించారు. చివరకు నేడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలయ్య ప్రకటన చేసారు. రాముడి చరిత్ర చెప్పే అసలైన వాల్మీకి దొరికాడని, అతడే జాగర్లమూడి క్రిష్ అంటూ ప్రకటన చేశాడు.
రెండవ చిత్రం
బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ రెండవ చిత్రంగా రాబోతోంది. వీరి కాంబినేషన్ లో ఇప్పటికే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.
నమ్మకాన్ని నిలబెడతా
తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్రని చలన చిత్రంగా రూపొందించే అవకాశాన్ని ఇచ్చిన బాలయ్యకు కృతజ్ఞతలు అని దర్శకుడు క్రిష్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లి నివాళులు అర్పించారు.