twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రోజు తేడాలో ఎన్టీఆర్ 'బృదావనం'...మహేష్ 'ఖలేజా'

    By Srikanya
    |

    మహేష్ ఖలేజా చిత్రం అక్టోబర్ ఏడున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అంతకు ఒక రోజు తర్వాత అంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎన్టీఆర్..బృందావనం రిలీజ్ అవుతోంది. దాంతో ఓ విధమైన పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక బృందావనం చిత్రం అక్టోబర్ ఎనిమిదిన తప్పనిసరిగా రిలీజ్ అవుతుందని నిర్మాత దిల్ రాజు నిన్న (సోమవారం)సాయింత్రం ప్రకటించారు. దశరా సీజన్ ని క్యాష్ చేసుకోవటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక అక్టోబర్ ఒకటవ తేదీన రోబో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పటివరకూ ఖలేజా చిత్రం ఆడియో కూడా విడుదల కాకపోవటంతో మరికాస్త ఈ చిత్రం వెనక్కి వెళ్తుందని మరికొంతమంది అంటున్నారు. ఏదైమైనా వచ్చే నెల పెద్ద సినిమాలు వరస కడతాయన్నమాట. అయితే అందరూ పండగ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలంటే మాత్రం కష్టం అని విశ్లేషకులు అంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X