twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టోరీలైన్: బృందావనం స్టోరీలైన్, జూ.ఎన్టీఆర్ ఇద్దరి వాడే

    By Srinivas
    |

    జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా, కాజల్, సమంత కథానాయికలుగా ఈ నెల 14న విడుదలవుతున్న బృందావనం చిత్రంపై నందమూరి అభిమానులు, సినీ పరిశ్రమతో పాటు రాష్ట్రం కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. వంశీ పైడిపల్లి, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్రంలో తమన్ కంపోస్ చేసిన డాన్సులను ఎన్టీఆర్ అదరగొట్టాడంటున్నారు. ఎన్టీఆర్ కూడా ఈ చిత్రంలో కొత్తగా కనిపిస్తున్నాడు. ట్రయలర్స్ చూస్తె అది అర్థం అవుతోంది. మరి స్టోరీ కూడా కొత్తగా ఉండి అలరిస్తుందా పవన్ కళ్యాన్ పులి, మహేశ్ బాబు ఖలేజా మాదిరిగానే బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతుందా చూడాలి. దర్శకుడు వంశీ ఎన్టీఆర్ ను కొత్తగా చూపించాడంటున్నారు. అంతే కాకుండా ఈ చిత్రం గ్రామీణస్థాయి ఆధారంగా వస్తున్న చిత్రం. ఇప్పటి వరకు ఎన్టీఆర్ నుండి ఇలాంటి చిత్రం రాకపోవటంతో ఎన్టీఆర్ కొత్తగా వస్తున్నట్టుగానే అనుకోవచ్చు.

    నాగచైతన్య సరసన కథానాయికగా పరిచయమయిన ముద్దుగుమ్మ సమంత, మగధీర వంటి సూపర్ హిట్ సొంతం చేసుకున్న కాజల్ ఈ చిత్రంలో తన అందాలతో కనువిందు చేయనున్నారని ఇప్పటికే అంటున్నారు. వారి అందాలకు తాతయ్య, బాబాయ్ లాగే ఎన్టీఆర్ నవరసాలు పండిస్తే ఇక అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు. ఎన్టీఆర్ పాత్ర కూడా డిఫరెంట్ గా ఉంటుందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. కథనం లేని కారణంగా పులి, ఖలేజా చిత్రాలు బోల్తా పడ్డాయి. అందుకు తోడుగా సూపర్ స్టార్ రజినీ చిత్రం వచ్చింది. రజినీ ఇమేజ్ కు తోడు ఐశ్వర్య అందం, హాలీవుడ్ టెక్నాలజీతో వచ్చిన రోబో చిత్రం వారి చిత్రాలు వారం రోజులు కూడా ఆడకుంటా చేసింది. రోబో చిత్రం ప్రభావం ఎన్టీఆర్ బృందావనంపై కూడా పడుతుందనటంలో సందేహం లేదు. అయితే విలేజ్ డ్రాప్ లో కట్టి పడేసే కథనంతో వస్తుందని యూనిట్ చెబుతున్నారు. మరి చూద్దాం. రోబోను ఏపాటి తట్టుకుంటుందో.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X