Don't Miss!
- News మేషరాశిలో శుక్ర దహనం.. ఈ రాశులవారికి కెరీర్ లో పెనుసవాళ్లు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అన్నకు ప్రేమతో.. తమ్ముడు ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసా?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొంత కాలంగా వరుస సినిమాలను చేస్తున్నాడు. తాజాగా జయేంద్ర దర్శకత్వంలో మిల్కీ బ్యూటి తమ్ముతో కలిసి కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యూర్ లవ్ స్టోరితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాని ప్రముఖ కెమెరా మెన్ అయిన గుహాన్ దర్శకత్వంలో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జంటగా నివేదా థామస్, శాలిని పాండే నటించనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ క్లాప్ కొట్టబోతున్నాడని తెలుస్తోంది. అన్న కోసం తమ్ముడు సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి రాబోతుండడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు రేపు తెలిసే అవకాశం ఉంది.