Don't Miss!
- News ఏప్రిల్ 1న రూ.2000 నోట్ల డిపాజిట్, ఎక్స్ఛేంజ్ -ఆర్బీఐ కీలక ప్రకటన..!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
అన్నకు ప్రేమతో.. తమ్ముడు ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడో తెలుసా?
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కొంత కాలంగా వరుస సినిమాలను చేస్తున్నాడు. తాజాగా జయేంద్ర దర్శకత్వంలో మిల్కీ బ్యూటి తమ్ముతో కలిసి కళ్యాణ్ రామ్ 'నా నువ్వే' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 25 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యూర్ లవ్ స్టోరితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
కళ్యాణ్ రామ్ తన నెక్స్ట్ సినిమాని ప్రముఖ కెమెరా మెన్ అయిన గుహాన్ దర్శకత్వంలో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రేపు ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కు జంటగా నివేదా థామస్, శాలిని పాండే నటించనున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోయిన్స్ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.
తాజా సమాచారం మేరకు ఈ ఫంక్షన్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నాడని సమాచారం. ఎన్టీఆర్ క్లాప్ కొట్టబోతున్నాడని తెలుస్తోంది. అన్న కోసం తమ్ముడు సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి రాబోతుండడం విశేషం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి పూర్తి వివరాలు రేపు తెలిసే అవకాశం ఉంది.