Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ బ్యాచ్ ని చితక్కొట్టిన జూ.ఎన్టీఆర్
హైదరాబాద్ : ఎన్టీఆర్ ఇప్పుడు మంచి కసి మీద ఉన్నాడు. తను ఎంతగానో ఊహించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాకపోవటంతో తన తదుపరి చిత్రం రభస తో ఎలాగైనా మెగా హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా... షాయాజీ షిండే, బ్రహ్మాజీ, భరత్ బృందాన్ని ఎన్టీఆర్ చితకొట్టాడు. దీనికి రామ్లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వం వహించారు.
ఇంతకీ ఎన్టీఆర్ ఎందుకు కొడుతున్నాడు అంటే ఇప్పుడే తెలీదు. వాళ్లు ఈ హీరోకి నచ్చని పనో... ప్రజల్ని ఇబ్బంది పెట్టినపనో చేసుంటారు. ఈ బుద్ధి చెప్పే కార్యక్రమమంతా ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం. ఫిల్మ్సిటీలోని ఫ్లెక్స్ హౌస్లో చిత్రీకరణ జరుగుతోంది. సమంత, ప్రణీత హీరోయిన్స్. బెల్లంకొండ గణేష్బాబు నిర్మాత. వచ్చే నెల 5వరకు ఇక్కడ చిత్రీకరణ జరుగుతుంది.
ఇక బాధ్షా లో.. డిఫెరెంట్ హెయిర్ స్టైల్స్ తో కనిపించిన ఆయన ఈ రభస చిత్రం లో కూడా చాలా విభిన్నంగా కనిపించటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన ప్రిపేరవుతున్నట్లు సమాచారం. అందులోనూ ఈ చిత్రంలో ఆయన ప్లే బోయ్ గా కనిపించనున్నారు కూడా. సెప్టెంబర్ 25 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... "మేం ఇప్పటి వరకూ ప్రత్యేకంగా ఏదీ అనుకోలేదు. కానీ కొత్త హెయిర్ స్టైల్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాం. ఈ చిత్రంలో మల్టిఫుల్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించబోతున్నాడు. అందులో భాగంగానే హెయిర్ స్టైల్ ని మార్చాలనుకుంటున్నాం ," అని తేల్చి చెప్పారు.
రామ్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేష్ నిర్మించిన 'కందిరీగ' భారీ విజయం అందుకుంది. ఆ ఉత్సాహంతో ఈ సారి సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఇదే బేనరులో ఎన్టీఆర్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2014 సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు. దీనికి వర్కింగ్ టైటిల్ గా 'రభస' పేరును నిర్ణయించారు. ఇది వర్కింగ్ టైటిల్ మాత్రమే దీనిని మార్చే అవకాశం ఉంది.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్కి సరిగ్గా సరిపోయే కథని సంతోష్ సిద్ధం చేశారు. కథ వినగానే ఎన్టీఆర్ ఎంతో ఇన్సై్పర్ అయి సెట్స్కెళదామని అన్నారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇతర వివరాలు త్వరలో వెల్లడిస్తాం'' అని తెలిపారు. 'ఆది' వంటి మెగాహిట్ చిత్రాన్ని నిర్మించిన సాయిగణేష్ ప్రొడక్షన్స్ పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్టీఆర్తో సినిమా తీస్తుండడం విశేషం. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లంకొండ సురేష్, నిర్మాత: బెల్లంకొండ గణేష్బాబు, కథ-కథనం-దర్శకత్వం: సంతోష్ శ్రీనివాస్.