Don't Miss!
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News పవన్కు బిగ్ షాక్..వైసీపీలోకి జనసేన కీలక నేత
- Finance HUL News: ఆ వ్యాపారం నుంచి తప్పుకుంటున్న హిందుస్థాన్ యూనీలివర్.. 20 ఏళ్ల తర్వాత..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
- Lifestyle నోరూరించే పచ్చి మామిడికాయ గొజ్జు మామిడికాయ కర్రీ వేడివేడి అన్నంతో తింటుంటే ఆహా అనాల్సిందే..
- Technology ఆపిల్ వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ 2024 తేదీ వెల్లడి.. iOS 18, GenAI పై కీలక ప్రకటనలకు అవకాశం..!
పూరీ జగన్నాధ్ కి ఎన్టీఆర్ ఇచ్చిన గిప్ట్ బ్రూస్లీ
హైదరాబాద్ :''నాకు పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు కుక్కపిల్లలను పెంచుకొనేవాడిని. ఆ అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. పక్షులు, కుక్క పిల్లల్ని పెంచుతుంటా. ఆ ఇష్టం చూసే ఎన్టీఆర్ ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దానికి బ్రూస్లీ అని పేరు పెట్టుకొన్నాం. సినిమాలతో బిజీగా ఉండడం వల్ల.. వాటితో కలిసి ఆడుకొనే అవకాశం రావడం లేదు'' అన్నారు పూరీ జగన్నాధ్.
ఇక జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో త్వరలో మరో చిత్రం తెరకెక్కనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పూరీ ఓ టైటిల్ జజెస్టు చేస్తే దాన్ని ఎన్టీఆర్ వెంటనే ఓకే చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ టైటిల్ మరేదో కాదు..రాము. గతంలో సీనియర్ ఎన్టీఆర్ రాము టైటిల్ తో ఓ చిత్రం చేసారు. ఆ తర్వాత బాలకృష్ణ అదే టైటిల్ తో మరో చిత్రం చేసారు. ఆ రెండు చిత్రాలు సూపర్ హిట్. దాంతో అదే టైటిల్ తో మరోసారి ఆ మ్యాజిక్ ని రిపీట్ చెయ్యాలని ఎన్టీఆర్,పూరీ ఫిక్స్ అయ్యారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఎటువంటి అధికారిక సమాచారం లేదు.
ఆ మధ్యన పూరీ జగన్నాధ్. ఆ విషయాలను,షెడ్యూలను ఆయన ట్విట్టర్ లో ప్రకటించారు. ఆ ట్వీట్ లో...ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా ఆగస్టులో మొదలవుతుంది. గణేష్ బండ్ల ఈ చిత్రం నిర్మిస్తారు. సినిమా మొత్తం అమెరికాలోనే షూటింగ్ ఉంటుంది. ఇక రవితేజ సినిమా మార్చిలోనూ,పవన్ కళ్యాణ్ తో చేయబోయే చిత్రం మే నెలలోనూ, మహేష్ తో చేయబోయే చిత్రం ఆ తర్వాత ఉంటుంది అన్నారు. ఇక ఎన్టీఆర్ తో ఆంధ్రావాలా చేసిన తర్వాత పూరీ చేస్తున్న చిత్రం ఇదే.
అయితే ప్రస్తుతం పూరీ జగన్నాధ్ తాను పవన్ తో చేయాల్సిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంటున్నారు. అలాగే ఎన్టీఆర్ తన బాద్షా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. తాజాగా అందిన సమాచారం ఏమంటే.... ఈ చిత్రం రద్దుకాలేదని, త్వరలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. జూ ఎన్టీఆర్తో దమ్ము చిత్రాన్ని నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్ బేనర్ వారు ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయట పెట్టేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.