Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సింహాద్రి' విడుదల రోజే ఎన్టీఆర్ కొత్త చిత్రం విడుదల
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు రూపొందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుంచి జరుగనుంది. అలాగే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి 'సింహాద్రి' విడుదలైన జూలై 9న ఈ సినిమాను విడుదల చేస్తారు.
దిల్ రాజు మాట్లాడుతూ ''ఎన్టీఆర్తో 'బృందావనం' నిర్మించాం. ఈసారి పక్కా మాస్ కథతో వస్తున్నాం. హరీష్ శంకర్ మంచి కథ సిద్ధం చేశారు. ఎన్టీఆర్ శైలికి చక్కగా సరిపోతుంది. కథలో మరో కథానాయికకూ చోటుంది. త్వరలోనే ఆమె పేరును ప్రకటిస్తాం. జులై 9న 'సింహాద్రి' విడుదలైంది. అదే రోజు... ఎన్టీఆర్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.
అలాగే " పూజా కార్యక్రమాలు జరిగాయి. జనవరి 3 నుంచి 14 వరకు హైదరాబాద్లో తొలి షెడ్యూల్ చేస్తాం. ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో మంచి సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్స్ను తెరకెక్కిస్తాం. 'బృందావనం' తర్వాత మా బ్యానర్లో సమంత, ఎన్టీఆర్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంటాయి. వీరికి తోడు హరీష్శంకర్ కాంబినేషన్. అందరి అంచనాలను చేరే విధంగా కథ సిద్ధమైంది. నందమూరి అభిమానులకి ఈ సినిమా పండుగలా ఉంటుంది'' అని అన్నారు.
జనవరి 3 నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభిస్తారు. 11 వరకూ ఎన్టీఆర్-సమంతలపై కొన్ని సన్నివేశాలతో పాటు, యాక్షన్ ఘట్టాలను రూపొందిస్తారు.ఈ చిత్రానికి కెమెరా: ఛోటా.కె.నాయుడు, కూర్పు: గౌతంరాజు, యాక్షన్: కనల్ కణ్ణన్, సంగీతం: థమన్.యస్., స్క్రీన్ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్. సహ నిర్మాతలు: శిరీష్ - లక్ష్మణ్, నిర్మాత: రాజు, కథ, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.యస్.