twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ 'చారిత్రా'త్మక చిత్రం

    By Staff
    |

    "అరుంధతి", "మగధీర" చిత్రాల సక్సెస్ తర్వాత ఇప్పుడు పలువురు టాలీవుడ్ ప్రముఖులు చారిత్రక ఇతివృత్తాలతో కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. భారీ సెట్లతో సంచలన చిత్రాలను నిర్మించడంలో దిట్ట అయిన గుణశేఖర్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ "రుద్రమ దేవి"ని కార్యరూపంలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల తాజా భోగట్టా.

    "ఒక్కడు", "అర్జున్" వంటి హెవీ బడ్జెట్ చిత్రాలను అందించిన గుణశేఖర్ ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడుగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అనంతరం చారిత్రక వీరనారి "రుద్రమ దేవి" చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రాయలసీమ వారియర్ ప్రిన్స్ గా పేరున్న రుద్రమదేవి చరిత్రకు సంబంధించి ఇప్పటికీ రీసెర్చ్ వర్క్ చేసి స్క్రిప్టు సైతం రెడీ చేసినట్టు తెలుస్తోంది.

    ఈ చిత్రంలో అత్యంత పవర్ ఫుల్ గా "గోన గన్నారెడ్డి" పాత్ర ఉండబోతోందనీ, ఈ పాత్ర కోసం ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను సంప్రదించారనీ సమాచారం. ఈ సీజన్ లోనే ఈ చిత్రానికి ఒక కార్యరూపం ఇవ్వాలనే ఆలోచలో గుణశేఖర్ ఉన్నారు. చారిత్రాత్మక చిత్రాలలో జీవించడం నందమూరి వారికి వెన్నతో పెట్టిన విధ్య. అలనాటి ఎన్టీఆర్ నుండీ ఇప్పటి ఎన్టీఆర్ వరకూ అందరూ ఇలాంటి పాత్రల్లో జీవించి విమర్శకుల ప్రశంసలు పొందిన వారే. ఎన్టీఆర్ చైల్డ్ ఆర్టిస్టుగా పరిచయమైన చిత్రం ''రామాయణం'' కూడా ఓ చారిత్రాత్మక అధ్బతమే. దీనికీ గుణశేఖరే దర్శకత్వం వహించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X