twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మగ్గరు మిత్రులతో కారులో ఫుల్‌ గా ఎంజాయ్‌ చేసిన జూ ఎన్టీఆర్‌...

    By Sindhu
    |

    యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'అదుర్స్‌" చిత్రం తర్వాత నటిస్తు తాజా చిత్రాలు 'బృందావనం, శక్తి". ఇటీవలే ప్రారంభమైన ఈ రెండు చిత్రాల షూటింగ్‌ లో ఫుల్‌ బిజీగా వుంటున్నాడు ఎన్టీఆర్‌. ఇక గత నాలుగు రోజుల క్రితం 'బృందావనం"కు సంబంధించిన ఒక పాట షూటింగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాల్లో పాల్గొన్న ఎన్టీఆర్‌ నిన్న 'శక్తి" షూటింగ్‌ నిమిత్తం మనాలీ వెళ్ళటానికి ఢిల్లీ వెళ్ళాడు ఎన్టీఆర్‌. కానీ వాతావరణం బాగోలేకపోవడంతో ఫ్లైట్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయట. దాంతో చేసేదిలేక రోడ్డు మార్గం ద్వారా మనాలీ వెళ్ళటానికి కారులో బయలుదేరాడు ఎన్టీఆర్‌. ఇక ఈ వార్త తెలిసిన కమెడీయన్స్‌ వేణుమాధవ్‌, కృష్ణభగవాన్‌, ఆలీ కూడా ఎన్టీఆర్‌ కారులో సందడి చేస్తూ 'శక్తి" షూటింగ్‌కి వెళ్ళారట. దాదాపు 300 కి.మీ దూరంలో ఉన్న మనాలీకి ఈ ముగ్గురు కమెడియన్లతో ఎన్టీఆర్‌ ఫుల్‌గా జోకులేసుకుంటూ...ఎంజాయ్‌ చేస్తూ జర్నీ చేశాడట. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు ఎన్టీఆర్‌. ఇలియానా మాత్రం ఓ కారులో వెళ్ళింది. వాతావరణం బాగా లేకపోవడంతో గమ్యం చేరే వరకూ ఇలియానాకి భయం భయంగా అనిపించిందట. దాదాపు 7గంటలు భయపడుతూనే ప్రయాణం చేసానని ఇలియానా చెప్పింది.

    మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న'శక్తి"చిత్రం లో జూ ఎన్టీఆర్ సరసన ఇలియానా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులోని గ్రాఫిక్స్ చూపర్లకు చాలా అద్బుతంగా తనదైన శైలిలో చిత్రీకరణ ఉంటుందంటున్నారు మెహర్ రమేష్. ఐక్య్యూబ్ స్టూడియో ప్రై.లిమిటెడ్ ఇండియాలో ప్రసిద్ది చెందినది. ఇంటర్నేషనల్ లెవల్ లో విషువల్ ఎఫెక్ట్స్ తో గ్రాపిక్స్ ను పొందుపర్చనున్నారు. శక్తి చిత్రానికి చార్లెస్ దార్బే గ్రాఫికల్ వర్క్ చేయనున్నారు. ఇదే కంపెనీ వారు అమితాబ్ బచ్చన్ తో 'అల్లాదిన్"మరియు అభిషేక్ బచ్చన్ తో'ద్రోణ" సినిమాకు పనిచేయడం విశేషం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X