Don't Miss!
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
విపరీతమైన చలిలో ఎన్టీఆర్,కాజల్ ఇలా..(ఫోటో)
హైదరాబాద్ : ఎన్టీఆర్,కాజల్ కలిసి నటిస్తున్న చిత్రం బాద్షా. ఈ చిత్రం ప్రస్తుతం స్విజ్జర్ లాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ దర్శకుడు శ్రీనువైట్ల వీరిద్దరి మధ్య ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ మైనస్ 13 డిగ్రీల టెంపరేచర్ ఉంచి. ఇంత ఎక్సట్రీమ్ టెంపరేచర్ లో కూడా వీరిద్దరూ ప్రేక్షకులలో వేడి పుట్టించే విధంగా అద్బుతమైన స్టెప్స్ వేస్తున్నారు. చలి ఎలా ఉన్నా పాట మాత్రం అద్బుతంగా వస్తోందని చెప్తున్నారు. మీరు చూస్తున్నది ఆ లొకేషన్ లో తీసిన ఫోటోనే.
ఇక ఈ చిత్రం కోసం తమిళ హీరో శింబు ఓ పాటను ఆలపించారు. 'డైమండ్ గాళ్..' అంటూ సాగే హుషారైన పాటను ఆయన పాడారు. ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. 'బ్యాక్ బెంచ్ స్డూడెంట్' చిత్రం కోసం కూడా శింబు గాయకుడి అవతారం ఎత్తారు. ఎన్టీఆర్తో ఉన్న స్నేహం కారణంగానే 'బాద్ షా' కోసం శింబు పాట పాడేందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే నెలలో 'బాద్షా' పాటల్ని విడుదల చేస్తారు.
హీరోల ఇమేజ్కి తగ్గ రీతిలో కథలను ఎంచుకోవడం, వారిలోని మాస్ యాంగిల్ని అద్భుతంగా వినియోగించుకోవడం, తనదైన శైలిలో రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తడం... ఇదీ దర్శకుడు శ్రీనువైట్ల స్టైల్. అందుకు ఆయన గత చిత్రాలే ఉదాహరణ. శ్రీనువైట్ల గత చిత్రం 'దూకుడు' బాక్సాఫీస్ దగ్గర చేసిన హల్చల్ అంతాఇంతా కాదు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్తో 'బాద్షా' చేస్తున్న విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ . బండ్ల గణేష్ నిర్మాత.
ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ- ''తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు. ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తాయి. 'బాద్షా'గా ఓ కొత్త ఎన్టీఆర్ని చూస్తారు'' అని తెలిపారు.
''ఎన్టీఆర్ ఇమేజ్కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.