Don't Miss!
- News విడుదల రజిని కిడ్నాప్...నామినేషన్ వేయకుండా
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ తో చిత్రం గురించి కొరటాల శివ ట్వీట్
కొరటాల శివ ట్వీట్ లో... మేమిద్దరం మా ప్రాజెక్టు లలో బిజీగా ఉన్నాం. ఎన్టీఆర్ ఇప్పటికే కందిరీగ దర్శకుడు సినిమా చేస్తున్నారు. మే నెల దాకా ఆ చిత్రం షెడ్యూల్ ఉంది. మరో ప్రక్క కొరటాల శివ..మహేష్ బాబుతో యు టీవి బ్యానర్ లోచేసే చిత్రం జూన్ లేదా జూలై లో ప్రారంభమవుతుంది. కాబట్టి మేమిద్దరం తర్వాత కలిసి పనిచేస్తాం అంటూ ట్వీట్ చేసారు.
ఇక ఏ సినిమాకైనా కథ ముఖ్యం. దానినుంచే పాత్రలు పుడతాయి. నా మిర్చి సినిమాకి చక్కని టీమ్ కుదిరింది. అందువల్ల ఔట్పుట్ బాగా వచ్చింది. మణిరత్నం సినిమాలో గొప్ప కథని చెబుతారు. రాజ్కుమార్ సంతోషి సినిమాలన్నా ఇష్టం. వీరిద్దరూ ఎమోషన్, సంఘర్షణ బాగా చూపిస్తారు. నాకు వీళ్లే ప్రేరణ అన్నారు కొరటాల శివ.
ఇక కథే సినిమాని నడిపించేది. మాటల్ని పుట్టించేది. అలాగే కథ, స్క్రిప్టు రాసుకోవడం తెలిస్తే దర్శకత్వం వహించడం కష్టమేమీ కాదు. కెమెరా షాట్లు తెలియాల్సిన అవసరం లేదు. రాయడం వస్తే..టెక్నికల్ విషయాలు సెట్స్కెళ్లి చూసి నేర్చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నా కథల్ని దర్శకులు బాగానే చూపించారు. అవసరమైతే ఆ సెట్స్లో కూడా తమ వ్యూస్ని దర్శకులు నాతో పంచుకునేవారు. అయితే నా కథల్ని నేనైతే..వారికంటే బెటర్గా చూపించగలను అనిపించింది. ఎమోషన్ని వారికంటే గట్టిగా చెప్పగలను అనే కాన్ఫిడెన్స్తోనే దర్శకుడినవ్వాలని అనిపించింది అని చెప్పుకొచ్చారు.
అలాగే చిన్నప్పట్నుంచి పుస్తకపఠనం, రచనలు చేయడంపై ప్యాషన్ ఉంది. పోసాని కృష్ణమురళి నా బంధువు. దాంతో బిటెక్ పూర్తయ్యాక అతడి వద్ద శిష్యరికం చేశాను. రవితేజ 'భద్ర'కి తొలిసారి మాటలు రాశాను. 'బృందావనం' చిత్రానికి కథ కూడా నేనే రాశాను. మళ్లీ ఓ పెద్ద కథని రాస్తా. దాంట్లో పెద్ద హీరో నటిస్తాడా? ఇంకెవరైనా చేస్తారా? అనేది తర్వాత ఆలోచిస్తా. కథకే నా మొదటి ప్రాధాన్యం అన్నారు.