Don't Miss!
- News మైండ్ బ్లాక్, డీసీఎం తమ్ముడి ఆస్తుల విలువ?, తల్లి, అన్న దగ్గర అప్పులు చేసిన సిట్టింగ్ ఎంపీ!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అన్న కోసం వచ్చిన ఎన్టీఆర్.. తండ్రి కొడుకులు కలసి, కొత్త సినిమా విశేషాలు!
Recommended Video
కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కలసి కనిపిస్తే నందమూరి అభిమానులకు ఎప్పుడూ పండగే. ఆ దృశ్యం మరో మారు ఆవిష్కృతం అయింది. కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం నేడు ప్రారంభం అయింది. ప్రారంభ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. హరికృష్ణ కూడా హాజరు కావడం విశేషం. తండ్రి కొడుకులు ఇలా కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలో కలుసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫస్ట్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. హరికృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేయడం విశేషం. ప్రస్తుతం నా నువ్వే చిత్రంలో నటిస్తున్న కళ్యాణ్ రామ్ వెంటనే మరో చిత్రాన్ని ప్రారంభించారు. మీడియా సమావేశాలో చిత్ర యూనిట్ విశేషాలని వెల్లడించారు.
గుహన్ దర్శకత్వంలో
ప్రముఖ కెమెరామెన్ గుహన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. గుహన్ మాట్లాడుతూ ఇది ఓ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం అని అన్నారు. కళ్యాణ్ రామ్ కథ వినగానే అంగీకరించారని అందుకు థాంక్స్ అని అన్నారు. అతిధులుగా విచ్చేసిన ఎన్టీఆర్, హరికృష్ణకు గుహన్ దన్యవాదాలు తెలియజేశారు.
హీరోయిన్ల నివేద, షాలిని
ఈ చిత్రంలో జైలవకుశ ఫేమ్ నివేద థామస్, అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. ఈ వేడుకకు హరారైన వారందరికీ థాంక్స్ అని షాలిని తెలిపింది. ఎన్టీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. నివేదా మాట్లాడుతూ.. అందరి అనుభవమే ఈ చిత్ర కథ అని తెలిపింది. ఏడు నెలల గ్యాప్ తరువాత మరో చిత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్నానని అందుకు సంతోషంగా ఉందని నివేద తెలిపింది.
బాబ్జి బాబు బాగా బిజీ
బాబ్జి బాబు బాగా బిజీ అని రేడియో మిర్చిలో అలరించే మిర్చి కిరణ్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. కెమెరామెనే దర్శకుడు కావడం చాలా అదృష్టం అని మిర్చి కిరణ్ అన్నారు. అందువలన విజువల్స్ అనుకున్న విధంగా వస్తాయని అన్నారు.
నా నువ్వే తరువాత మళ్ళి
ఈ చిత్రానికి మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నటిస్తున్న నా నువ్వే చిత్రానికి కూడా ఆయనే నిర్మాత కావడం విశేషం. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, హరికృష్ణకు మహేష్ కోనేరు కృతజ్ఞతలు తెలియజేసారు. వారు ఎప్పుడూ తనకు సప్పోర్ట్ చేస్తూ ఉంటారని అన్నారు. దర్శకుడు గుహన్ అద్భుతమైన కథ సిద్ధం చేసారని, కళ్యాణ్ రామ్ కి అయితే బావుంటుందని ఆయనకు వినిపించడం, ఒకే చేయడం జరిగిందని అన్నారు.
విడుదల అప్పుడే
మే 2 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించి ఈ ఏడాది ద్వితీయార్థంలో చిత్రాన్ని విడుదల చేస్తామని మహేష్ కోనేరు అన్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం నిరించబడుతోంది.