Don't Miss!
- News కవిత అరెస్ట్ పై ఇంతకాలానికి కేసీఆర్ స్పందన వెనుక బిగ్ రీజన్
- Finance Anant Ambani: తండ్రికి తగ్గ తనయుడు అనంత్ అంబానీ.. ఆ ఆలయాలకు భారీ విరాళాలు..!!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడ్డినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
అక్కడితోనే కథ ముగింపు: ‘ఎన్టీఆర్-మహానాయకుడు’ ప్రీ రిలీజ్ రివ్యూ
ఎన్టీ రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' ఫిబ్రవరి 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదలవుతోంది. గురువారం(జనవరి 21) సాయంత్రమే యూఎస్ఏలో ప్రీమియర్ షోలతో పాటు హైదరాబాద్లో ప్రత్యేక షోలు వేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం 'ఎన్టీఆర్-కథానాయకుడు' జనవరి 9న విడుదలై పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా బాక్సాఫీసు వద్ద ఫెయిలైంది. మొదటి భాగం మొత్తం రామారావు సినీ జీవితం ఫోకస్ చేస్తూ రూపొందించారు.
రెండో భాగం 'ఎన్టీఆర్-మహానాయకుడు' రామారావు రాజకీయరంగ ప్రవేశం, పార్టీ స్థాపించి అధికారంలోకి రావడం, ఆతర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను ఫోకస్ చేస్తూ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెంచింది.
రామారావు రాజకీయ జీవితం
‘ఎన్టీఆర్-కథానాయకుడు' మూవీ రామారావు రాజకీయాల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేయాలనే నిర్ణయం తీసుకోవడం, పార్టీని స్థాపించిన అంకంతో ముగించారు. ‘ఎన్టీఆర్-మహానాయుడు'లో రామారావు పార్టీ స్థాపించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో చేసిన పర్యటన, 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం లాంటి సంచలనం సృష్టించిన అంశాలను ప్రధానంగా చూపించనున్నారు.
ఆయనే విలనా?
అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్ తర్వాత నాదేండ్ల భాస్కర్ రావు పాత్రను చూపించిన తీరు చర్చనీయాంశం అయింది. ఇందులో కొన్ని సీన్లు ఆయన్ను విలన్గా చూపించబోతున్నారనే విధంగా ఉండటంతో సినిమాపై అటెన్షన్ మరింత పెరిగింది.
చంద్రబాబు పాత్ర ఎలా ఉండబోతోంది?
మరో వైపు ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు పాత్రను ఇందులో ఎలా చూపించబోతున్నారనేది కూడా ఈ చిత్రంలో ప్రధానంగా ఆసక్తికరేపే అంశం. చంద్రబాబు వ్యతిరేకులంతా... రామారావును వెన్నుపోటు పొడిచి అధికారం చేజిక్కించుకున్నారనే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ‘ఎన్టీఆర్-మహానాయుడు' సినిమా అటు రాజకీయ వర్గాలోనూ చర్చనీయాంశం అవుతోంది.
సినిమాకు అక్కడితో ముగింపు...
ఎన్టీ రామరావు జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం లక్ష్మీపార్వతిని పెళ్లాడిన తర్వాత మొదలైంది. అయితే ‘ఎన్టీఆర్-మహానాయుడు' సినిమా కథ రామారావు-లక్ష్మీ పార్వతి వివాహానికి ముందుగానే ముగించడం ద్వారా ఆ విషయాన్ని ప్రస్తావించే అవకాశం లేకుండా చేశారు.
నాదేండ్ల భాస్కర్ రావు ఇన్సిడెంట్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటారు. ఎన్టీఆర్ భార్య బసవతారకం మరణంతో సినిమా ముగుస్తుంది.
ఎన్టీఆర్-మహానాయకుడు
క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించారు. ఆయనకు జోడీగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. చంద్రబాబు నాయుడి పాత్రలో రాణా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఈ చిత్రాన్ని ఎన్.బి.కె.ఫిల్మ్స్ పతాకంపై బాలకృష్ణతో కలిసి విష్ణు ఇందూరి నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందించారు.