Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఎన్టీఆర్ మూవీ ఇంటర్వెల్ ఫైట్ కోసం రూ. 3 కోట్లు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం ప్రారంభత్సవం ఇటీవల జరింగింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
ఈ చిత్రంలో ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ ఫైట్ సీన్ సినిమాకు హైలెట్ అయ్యేలా ఉంటుందట. హాలీవుడ్ మూవీ స్థాయిలో ఉండే ఈ చేజింగ్ అండ్ ఫైటింగ్ సీన్ కోసం ఏకంగా రూ. 3 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. మాస్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతోన్న ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఖరారైనట్లు సమాచారం. ఈ చిత్రంలో విలన్ పాత్రలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ నటిస్తాడని తెలుస్తోంది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేదానికి గురై క్రికెట్ కు దూరమైన శ్రీశాంత్ కు పూరి సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రానికి వక్కతం వంశీ కథ అందిస్తున్నారు. పూరి జగన్నాధ్ తన ట్రేడ్ మార్క్ డైలాగ్స్, ఫాస్ట్ స్క్రీన్ ప్లే ని జోడించాడు. గతంలో వక్కంతం వంశీ..ఎన్టీఆర్ నటించిన అశోక్, ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పై బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించిన బండ్ల గణేష్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.