Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఎన్టీఆర్ ఓకే చేసిన రెండు పెద్ద ప్రాజెక్టులు..డిటేల్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ మరో రెండు పెద్ద ప్రాజెక్టులుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొదటిది తనకు అత్యంత ఇష్టుడైన వివి వినాయిక్ దర్శకత్వంలో చిత్రం,మరొకటి ఎప్పటినుంచో నలుగుతున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో చిత్రం. రామ్ చరణ్ తో ప్రస్తుతం వివి వినాయిక్ చేస్తున్న నాయిక్ చిత్రం అనంతంరం బెల్లంకొండ సురేష్ కుమారుడుని పరిచయం చేస్తూ చిత్రం ఉంటుంది. ఆ చిత్రం అనంతంరం ఎన్టీఆర్ తో చిత్రం ప్రారంభమవుతుంది. అంటే 2013 మధ్యలో ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభం అవుతుంది. ఆది,సాంబ, అదుర్స్ తర్వాత ఎన్టీఆర్,వినాయిక్ కాంబినేషన్ లో రాబోతున్న చిత్రం ఇదే.
మరో ప్రక్క త్రివిక్రమ్ తో చిత్రం చేయటానికి ఎన్టీఆర్ సైన్ చేసారు. ఆగస్టు 2013 నుంచి ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ లోగా త్రివిక్రమ్,పవన్ కాంబినేషన్ లో చిత్రం పూర్తవుతుంది. ఎన్టీఆర్,త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రాన్ని కె.ఎల్ నారాయణ దుర్గా ఆర్ట్స్ పతాకంపై చేస్తారు. ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది. త్రివిక్రమ్ శైలికి,ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే ట్రేడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ అవుతుంది. తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ చిత్రం మిరాకిల్స్ సృష్టిస్తుందంటున్నారు.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాద్షా చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ ''ఎన్టీఆర్ నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ రంగరించిన కథ ఇది. ఆయన నటన, గెటప్స్ ఆకట్టుకొంటాయి. హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపిస్తున్నారు దర్శకుడు. ఇటీవలే విదేశాల్లో పోరాట ఘట్టాల్నీ, సన్నివేశాల్ని చిత్రించాుర. అవి చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అన్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ పాత్ర కూడా డిఫెరెంట్ గా ఉంటుంది. ఆ పాత్ర గురించి చెబుతూ నిర్మాత బండ్ల గణేష్...సేవకుడిగా కాదు.... పాలకుడిగా బతకడమే అతనికిష్టం. బుల్లెట్లా కాదు, దాని లక్ష్యాన్ని శాసించే ట్రిగ్గర్లా ఉండడమే అతనికిష్టం. అందుకే తనకు తానే 'బాద్షా' అని ప్రకటించుకొన్నాడు. ఇంతకీ ఎవరతను? అతని లక్ష్యమేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అన్నారు బండ్ల గణేష్. ఈ చిత్రం అనంతరం ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో చిత్రం ప్రారంభం కానుంది.