Don't Miss!
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పూరి జగన్నాథ్ స్టోరీ ఓకే చేసిన జూ ఎన్టీఆర్!
హైదరాబాద్: 'ఆంధ్రావాలా' చిత్రం తర్వాత దాదాపు పదేళ్ల గ్యాప్ తీసుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్-జూ ఎన్టీఆర్లు త్వరలో మరో సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే జూ ఎన్టీఆర్ పూరి చెప్పిన స్టోరీ లైన్కు ఓకే చెప్పేసాడు. స్క్రిప్టు వర్కులో భాగంగా ఇటీవల బ్యాంకాక్ వెళ్లి వచ్చిన పూరి జగన్నాథ్.....దాన్ని జూ ఎన్టీఆర్కు వినిపించాడని తెలుస్తోంది.
స్క్రిప్టు వర్క్ పర్ఫెక్టుగా ఉందని జూ ఎన్టీఆర్ పూర్తి స్థాయి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ సంవత్సరం ద్వితీయార్థంలో ఈచిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కే ఈ చిత్రాన్ని ఓ బడా సినీ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతున్నాయి. నిర్మాతలు ఖరారైన తర్వాత సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.
యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టెనర్గా సాగే ఈచిత్రం గతంలో వచ్చిన పూరి జగన్నాథ్ మార్కు సినిమాలకు భిన్నంగా సాగుతుందట. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే ఈచిత్రానికి హీరోయిన్ ఎవరు? ఇతర సాంకేతిక నిపుణులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
అన్నీ ఒకే అయితే మే 2న సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు జూ ఎన్టీఆర్ పుట్టినరోజు. 'ఆంధ్రావాలా' తరవాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. మధ్యలో బండ్ల గణేష్ ఈ కాంబినేషన్ కుదర్చడానికి ప్రయత్నించాడు. కానీ... వీలు కాలేదు. ఈ సారి మాత్రం ఎన్టీఆర్ - పూరి జత కట్టడం ఖాయంగానే కనిస్తోంది.