Don't Miss!
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫ్యాన్స్ హంగామా ఇలా :ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ కోసం
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ లండన్లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 17న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తున్నారు. వినాయిక చవితి సందర్బంగా రిలీజ్ కానున్న ఈ ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు ఓ రేంజిలో ఉన్నాయి. ట్విట్టర్, ఫేస్ బుక్ లో అయితే ఈ క్రింద తరహా పోస్ట్ లతో హంగామా నడుస్తోంది.
Get
Ready
to
Experience
the
most
Stylish
version
of
#NTR
\m/
#NannakuPrematho1stLookOnSep17
@tarak9999
@Rakulpreet
pic.twitter.com/lfeFZM3vrh
—
NTR
Fans
(@NTR2NTRFans)
September
16,
2015
ఈ చిత్రానికి టైటిల్ ని అఫీషియల్ గా చిత్ర నిర్మాణ సంస్ద తన ఫేస్ బుక్ ఎక్కౌంట్ ద్వారా ఖరారు చేసింది. ఈ సినిమాకి 'నాన్నకు ప్రేమతో...' అనే టైటిల్ నే ఖరారు చేసారు. మొదటి నుంచీ ఈ టైటిల్ ప్రచారంలో ఉన్నా టైటిల్ మారే అవకాసం ఉందని చాలా మంది భావించారు. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ అఫీషియల్ ఎనౌన్సమెంట్ తో టైటిల్ విషయం తెలిసిపోయింది.
చిత్రం విశేషాలకు వస్తే....
'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్. ఆ తరవాత 'అదుర్స్'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్నగర్ వర్గాలు. ఎన్టీఆర్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకుడు. రకుల్ప్రీత్ సింగ్ కథానాయిక. ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.
ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్గా కనిపిస్తున్నాడు తారక్. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించా4రు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.
అలాగే ఈ సినిమా కోసం లండన్లోని ఓ అపార్ట్మెంట్లో ని 26 వ ఫ్లోర్ లో ఆఫీస్ సెట్ వేసారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న జగపతి బాబు ఆఫీసు గా ఇది కనిపించనుంది. ఇందుకోసం 60 లక్షలకు పైనే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంటర్వెల్ కు ముందు జగపతిబాబుకు, ఎన్టీఆర్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశం కోసం ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఈ సెట్కు రూపకల్పన చేశారని సమాచారం. అక్కడ లండన్ వర్కర్స్ కొందరు ఈ సెట్ నిర్మాణంలో పాలుపంచుకున్నట్లు చెప్తున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ ''ఎన్టీఆర్ని కొత్త తరహా పాత్రలో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన తెరపై కనిపించే విధానం భిన్నంగా ఉంటుంది. ఇదివరకటితో పోలిస్తే మరింత స్త్టెలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ కోసం ప్రత్యేకంగా ఓ బైక్ని తయారు చేయించాం. అది చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది''అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''ఎన్టీఆర్ సినీ ప్రయాణానికీ, మా సంస్థకి ఎంతో ప్రతిష్ఠాత్మకమైన చిత్రమిది. ఆ తర్వాత స్పెయిన్లో జరిగే షెడ్యూల్తో సినిమా పూర్తవుతుంది'' అన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని తమిళంలో డబ్బింగ్ చేసి అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరగుతున్నట్లు సమాచారం. అందులో భాగంగా కొందరు తమిళ నటుల్ని కీలకమైన పాత్రలకు తీసుకుందామనే ఆలోచనలో దర్శక,నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.