Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జూ.ఎన్టీఆర్ 'ఊసరవెల్లి'రీమేక్ కి రంగం సిద్దం
హైదరాబాద్ :ఎన్టీఆర్,సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'ఊసరవెల్లి'. భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు బెంగాలిలో రీమేక్ అవుతోంది. మిధున్ చక్రవర్తి కుమారుడు మిమో ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేసిన పాత్రను చేయనున్నాడు. ఈ చిత్రానికి రాకీ అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో తమన్నా చేసిన పాత్రను పూజ చేయబోతోంది. సుజిత్ మెండాల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్కడ దర్సక,నిర్మాతలకు బాగా నచ్చి రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 25 న హైదరాబాద్ లో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. 'ఊసరవెల్లి'చిత్రం క్రితం సంవత్సరం దసరా రోజున విడుదలైంది. ఈ చిత్రం మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకుంది.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాద్షా చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్,శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. ఈ చిత్రం టీజర్ ఈ నెల 24 న విడుదల కానుంది. ఈ చిత్రం దర్శకుడు శ్రీను వైట్ల పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆ రోజు విడుదల చేయాలని నిర్మాత గణేష్ బాబు నిర్ణయించుకున్నారు. శ్రీను వైట్ల కెరీర్ లో భారీ బడ్జెట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోందని,గబ్బర్ సింగ్ లా ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించాలని గణేష్ సైతం ఎంత ఖర్చైనా ఫరావలేదన్నట్లు ముందుకు వెళ్ళుతున్నట్లు సమాచారం.
ఇక ఈ టీజర్ రిలీజ్ విషయాన్ని రచయిత గోపీ మోహన్ ట్వీట్ ద్వారా తెలియచేసారు. ఆ ట్వీట్ లో...సెప్టెంబర్ 24,మా ఫేవరెట్ డైరక్టర్ శ్రీను వైట్ల పుట్టిన రోజు. ఆ రోజు, మా నిర్మాత బండ్ల గణేష్ గారు 'బాద్ షా'టీజర్ రిలీజ్ విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. చాలా సంతోషంగా ఉందని ట్వీట్ చేసారు. ఈ విషయాన్ని మరో రచయిత కోన వెంకట్ సైతం ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసారు. అలాగే ఈ చిత్రం గురించి గురించి చెప్తూ..బాద్షా బడ్జెట్ అన్ లిమెటెడ్...బాద్షా ఫన్ అన్ లిమెడెట్...ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అన్నారు.
జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో 'బాద్ షా' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.