Don't Miss!
- Technology వన్ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- News ఆ నలుగురిపై టీడీపీ గురి - జగన్ సమర్ధతకు సవాల్..!!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Finance 9 రోజులుగా 54 శాతం పెరిగిన స్టాక్.. బ్రోకరేజ్ తాజా టార్గెట్ ధర ఇదే.. మీరూ కొంటున్నారా..??
- Sports CSK జట్టులో కొత్త ప్లేయర్: రోహిత్-కోహ్లి వికెట్లు తీసిన ఘనుడు
- Lifestyle Gruha Pravesham Wishes in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘రభస ' రూమర్స్ కి చెక్ : నిర్మాత క్లారిటీ ఇచ్చారు
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ''ఇటీవల హైదరాబాద్లో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. ఇప్పటి వరకూ నాలుగు పోరాట సన్నివేశాల్నీ చిత్రీకరించాం. ఒక పాట మిగిలివుంది. ఆ పాటని విదేశాల్లో తెరకెక్కిస్తాం. ఈనెల 16 నుంచి 40 రోజుల షెడ్యూల్ మొదలెడతాం. అన్ని హంగులతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవికి తీసుకొస్తాం. 'ఆది' తరవాత మళ్లీ ఎన్టీఆర్తో మరో చిత్రం చేయడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొంటూనే ఆయన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాము''అన్నారు.
ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీన్వాస్ ('కందిరీగ' దర్శకుడు)దర్శకత్వంలో శ్రీ లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్ బేనరుపై బెల్లంకొండ గణేశ్బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం చివరి షెడ్యూల్ ఈ నెల 16 నుంచి జరుగుతుంది. చిత్రం వివరాలను నిర్మాత వెల్లడిస్తూ ' మా సినిమా కోసం హైదరాబాద్ మణికొండలో వేసిన భారీ ప్యాలెస్ సెట్లో ఎన్టీఆర్, సమంత సహా 60 మంది ముఖ్యతారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అలాగే నాలుగు పాటల్ని తీశాం. విదేశాల్లో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. నాలుగు ఫైట్స్ సహా మేజర్ టాకీ పార్ట్ పూర్తయింది. ' అని తెలిపారు.
ప్రణీత, బ్రహ్మానందం, ఆలీ, బ్రహ్మాజీ, నాజర్, జయసుధ, సీత, జయప్రకాశ్రెడ్డి, షాయాజీ షిండే, అజయ్, నాగినీడు, శ్రావణ్, భరత్, రవిప్రకాశ్, ప్రభాకర్, సురేఖావాణి, ప్రగతి, సత్యకృష్ణ, మీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఫొటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సంతోష్ శ్రీన్వాస్.