Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లక్ష్మీ’స్ ఎన్టీఆర్.... ఆ ఫోటోస్ పోస్టు చేసి టెన్షన్ పెడుతున్న వర్మ!
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఆత్మ రోజూ తన కలలోకి వస్తోందని, స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోందని తెలిపారు.
రామ్ గోపాల్ వర్మ తన సమయాన్ని మొత్తం 'లక్ష్మీ'స్' ఎన్టీఆర్ సినిమా కోసమే వినియోగిస్తున్నట్లు ఉన్నారు. సినిమా షూటింగ్ మొదలు కాకముందే తనదైన శైలిలో పబ్లిసిటీ హోరెత్తిస్తున్నారు. ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద అంశాన్ని కథగా ఎంచుకున్న వర్మ.... తెలుగు సినిమా చరిత్రలోనే మోస్ట్ కాంట్రవర్సల్ సినిమాగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ట్రై చేస్తున్నారు.
లక్ష్మీ'స్ ఎన్టీఆర్ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటుందనే ఆరోపణల ఉండటంతో కొందరు టీడీపీ నేతలు వర్మను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి విమర్శలను ఎంటర్టెన్మెంటులా ఫీలవుతున్న వర్మ.... ఏమాత్రం విసుక్కోకుండా వారికి సోషల్ మీడియా ద్వారా సమాధానాలు ఇస్తుండటం గమనార్హం.
మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వస్తోంది
లక్ష్మి'స్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది NTR అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది... అంటూ వర్మ తెలిపారు.
ఈ ఫోటోలతో టెన్షన్ పెడుతున్న వర్మ
అభిమానులు రూపొందించిన పోస్టర్స్ అంటూ వర్మ తన సోషల్ మీడియా పేజీలో రెండు రిలీజ్ చేశాడు. ఇవి ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ పోస్టర్స్లో ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి, చంద్రబాబు ఉండటం గమనార్హం.
లక్ష్మీ’స్ ఎన్టీఆర్ లో ఏయే పాత్రలు ఉంటాయి?
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ చివరి రోజుల్లో పడ్డ క్షోభను, దానికి కారణమైన పరిస్థితులను, వ్యక్తులను చూపెడతానంటున్న వర్మ.... ఎవరెవరి పాత్రలు ఇందులో చూపించబోతున్నారు అనేది హాట్ టాపిక్ అయింది.
కొంపతీసి అలా ముగించరు కా...ఓ అభిమాని సందేహం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై ఓ అభిమాని తనకు వచ్చిన సందేహం గురించి వర్మను ప్రశ్నించారు. ‘రాముగారు... "ఆకు చాటు పింద తడిసే..." అలాంటి డూయట్స్ ఉంటాయా? వైశ్రాయి హోటల్ నుండి ఎన్టీఆర్ మీద వేసిన చెప్పులను మాత్రమే చూపుతారా? లేక వేసిన వాళ్లని కూడా చూపుతారా? ఎన్టీఆర్ కి ఆగతి పట్టడానికి కారణమైన వారి పాత్రలను చూపుతారా? లేక హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మౌనంగా చూస్తున్న బుద్దుడికే అన్నీ తెలుసని, ముగిస్తారా?' అంటూ ఓ కామెంట్ పెట్టారు. మరి దీనికి వర్మ నుండి సమాధానం రావాల్సి ఉంది.