twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ 'శక్తి' ఎంతదాకా వచ్చింది?

    By Srikanya
    |

    ఎన్టీఆర్, మెహర్‌ రమేష్ ‌ల కాంబినేషన్‌ లో రూపొందుతోన్న 'శక్తి' చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఓ పాటను చిత్రీకరణలో జరుపుకుంటోంది. ఎన్టీఆర్‌, ఇలియానాపై రామోజీ పిల్మ్ సిటీలో వేసిన భారీసెట్‌ లో బృంద నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ జైపూర్ ‌లో జరిగింది. అశ్వనీదత్‌ తమ వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు ఇదే కాంబినేషన్లో 'కంత్రి' చిత్రం వచ్చింది. ఇక ఇలియానా ఇంతకు ముందు ఎన్టీఆర్ తో రాఖీ చిత్రంలో చేసింది. ఇప్పటివరకూ ఎన్టీఆర్‌ చేయని సరికొత్త నేపథ్యంలో ఈ చిత్రం తయారవుతుందనేది ఫిలింనగర్‌ వర్గాల సమాచారం. సీనియర్‌ రచయిత సత్యానంద్‌ ఈ చిత్రానికి మాటలు సమకూరుస్తున్నారు. ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, సీనియర్‌ రచయిత జె.కె.భారవి, 'వరుడు', 'ఆరెంజ్‌' చిత్రాల ఫేమ్‌ తోట ప్రసాద్‌, 'సారాయి వీర్రాజు' దర్శకుడు డి.ఎస్‌.కన్నన్‌ స్క్రిప్టు వర్క్‌ లో పాలుపంచుకుంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్‌ రెడ్డి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌, పాటలు: వేటూరి, సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి అందిస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ ఒకవైపు 'బృందావనం', మరోవైపు 'శక్తి' చేస్తున్నారు. 'బృందావనం' తుది దశకు చేరుకోవడంతో, ఆ షూటింగ్‌ పూర్తి కాగానే ఎన్టీఆర్‌ 'శక్తి'కే ఎక్కువ సమయం కేటాయించనున్నారు. 'శక్తి' ఏ తరహా కథాంశంతో రూపొందుతుందనే విషయంలో దర్శక నిర్మాతలు రహస్యంగా ఉంచుతున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X