Don't Miss!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- News అపార్ట్ మెంట్ లో మహిళ స్నానం చేస్తుంటే సెక్యూరిటీ గార్డు ?, పిల్లర్ కు కట్టేసి పిండేసి, అంతే !
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
పెళ్లైంది కదా..పరిస్దితిని అర్దం చేసుకోండి: ఎన్టీఆర్
ఊసరవెల్లిలో ఓ పాటలో ఇదివరకటిలా బొద్దుగా కనపించారు...మార్పు గమనించారా అని ఎన్టీఆర్ ని మీడీయా వారు ప్రశ్నిస్తే..దానికి స్పందనగా..పెళ్లైంది కదా...పరిస్దితిని అర్దం చేసుకోండి...అన్నారు నవ్వుతూ.అలాగే తర్వాతి సినిమాకి మారిపోతున్నా అన్నారు. ఇక తన భార్యకి ఎలాంటి పాత్రలో చూడాలని ఉందో చెప్తూ...తనకు యాక్షన్ సినిమాలు పెద్దగా నచ్చువు.కానీ నేను చేస్తే మాత్రం చూస్తుంది. అదెలా తెలుసు అంటే టీవీలో యాక్షన్ చిత్రాలు వచ్చినప్పుడు ఛానెల్ మార్చేస్తుంది. అప్పుడు నేను గమనించాను. మరి నా సినిమాలైతే తప్పకుండా ఛూస్తుంది. బార్య ధర్మం నెరవేర్చాలి కదా అని చూస్తోందా లేక ఇంకోటా అనేది అర్దం కాదు ఓ సారి అడిగితే ఓరగా చూసి నవ్వింది.
ఆ నవ్వుకు నేను అర్దం చేసుకునేదాన్ని బట్టి ఉంటుందనుకోండి. అదొక్కటే కాదు.తెరమీద నేను ఎలా కనిపించినా సరే ..తనకు బాగానే ఉంటుంది అన్నారు.అలాగే తన తదపరి చిత్రాలు గురించి చెబుతూ..బోయపాటి శ్రీను దమ్ము విందు భోజనంలా ఉంటుంది. ఆ తర్వాత శ్రీను వైట్ల, పూరీ జగన్నాధ్ చిత్రాలు ఉంటాయి అన్నారు. ఇక ఊసరవిల్లి విజయం గురించి చెబుతూ..ఊసరవెల్లి నాకు స్పెషల్ ఫిల్మ్. పరిశ్రమ రికార్డులను దాటుకుని ముందుకు వెళ్ళుతోందంటే సంతోషంగా ఉంది. ఏడుపు,నవ్వు, భయం ఒకటేమిటి అన్ని భావోద్వాగాలు ఉన్న చిత్రం. అందుకే రాతలు కాదు తలరాతలు మార్చే చిత్రం అన్నాను అన్నారు ఆనందంగా.