twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్లైంది కదా..పరిస్దితిని అర్దం చేసుకోండి: ఎన్టీఆర్

    By Srikanya
    |

    ఊసరవెల్లిలో ఓ పాటలో ఇదివరకటిలా బొద్దుగా కనపించారు...మార్పు గమనించారా అని ఎన్టీఆర్ ని మీడీయా వారు ప్రశ్నిస్తే..దానికి స్పందనగా..పెళ్లైంది కదా...పరిస్దితిని అర్దం చేసుకోండి...అన్నారు నవ్వుతూ.అలాగే తర్వాతి సినిమాకి మారిపోతున్నా అన్నారు. ఇక తన భార్యకి ఎలాంటి పాత్రలో చూడాలని ఉందో చెప్తూ...తనకు యాక్షన్ సినిమాలు పెద్దగా నచ్చువు.కానీ నేను చేస్తే మాత్రం చూస్తుంది. అదెలా తెలుసు అంటే టీవీలో యాక్షన్ చిత్రాలు వచ్చినప్పుడు ఛానెల్ మార్చేస్తుంది. అప్పుడు నేను గమనించాను. మరి నా సినిమాలైతే తప్పకుండా ఛూస్తుంది. బార్య ధర్మం నెరవేర్చాలి కదా అని చూస్తోందా లేక ఇంకోటా అనేది అర్దం కాదు ఓ సారి అడిగితే ఓరగా చూసి నవ్వింది.

    ఆ నవ్వుకు నేను అర్దం చేసుకునేదాన్ని బట్టి ఉంటుందనుకోండి. అదొక్కటే కాదు.తెరమీద నేను ఎలా కనిపించినా సరే ..తనకు బాగానే ఉంటుంది అన్నారు.అలాగే తన తదపరి చిత్రాలు గురించి చెబుతూ..బోయపాటి శ్రీను దమ్ము విందు భోజనంలా ఉంటుంది. ఆ తర్వాత శ్రీను వైట్ల, పూరీ జగన్నాధ్ చిత్రాలు ఉంటాయి అన్నారు. ఇక ఊసరవిల్లి విజయం గురించి చెబుతూ..ఊసరవెల్లి నాకు స్పెషల్ ఫిల్మ్. పరిశ్రమ రికార్డులను దాటుకుని ముందుకు వెళ్ళుతోందంటే సంతోషంగా ఉంది. ఏడుపు,నవ్వు, భయం ఒకటేమిటి అన్ని భావోద్వాగాలు ఉన్న చిత్రం. అందుకే రాతలు కాదు తలరాతలు మార్చే చిత్రం అన్నాను అన్నారు ఆనందంగా.

    English summary
    Ntr happy with his latest film Oosaravelli. He says Oosaravelli film creates records in Tollywood.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X