Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ ఫాన్స్ కి హ్యాపీ న్యూస్!!
ఆమధ్య రోడ్డు ప్రమాదంలో గాయపడిన యంగ్ హీరో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకున్నారు. తిరిగి సినిమా షూటింగులో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ సంగతిని ఎన్టీఆర్ స్వయంగా మీడియాకు తెలియచేసారు. ఎన్టీఆర్ బుధవారం మళ్లీ మేకప్ వేసుకున్నారు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో మొదలైంది. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి వల్లభనేని వంశీమోహన్ నిర్మాత. కొడాలి నాని సమర్పిస్తున్నారు. నయనతార, షీలా కథానాయికలు. ఎన్టీఆర్ మాట్లాడుతూ మా కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంలో అన్ని అంశాలను మేళవిస్తున్నాం. సాంకేతికపరంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. వినాయక్ చెబుతూ తారక్ తో ఇది నేను చేస్తున్న మూడో చిత్రం. తన ఇమేజ్కి తగ్గట్టు ఉంటుంది. వాణిజ్య విలువలు పుష్కలంగా ఉంటాయి. సంచలనాత్మక చిత్రమవుతుందని అన్నారు. జులై 1న ప్రారంభమైన ఈ షెడ్యూల్తో మొత్తం చిత్రీకరణ ముగుస్తుంది. ఎన్టీఆర్-వినయ్ లకు హ్యాట్రిక్ చిత్రమవుతుందని నిర్మాత పేర్కొన్నారు. కథ ప్రకారం ఎన్టీఆర్ ఈ చిత్రంలో ద్వి పాత్రలను పోషిస్తున్నాడు. అందులో ఒక పాత్ర నరసింహాచారి కాగా మరో పాత్ర నరసింహ అని వినికిడి. సెకెండాఫ్ లో అన్ని డ్యూయల్ రోల్ చిత్రాలు లాగానే పాత్రలు తారుమారవటం..అందు నుంచి వచ్చే కామిడీ అని నవ్విస్తుందంటున్నారు.
సీమశాస్త్రి తరహాలో ఎన్టీఆర్..డాన్ ప్లేస్ లోకి వెళ్లి అక్కడ చేసే పోరాటాలు పూర్తి వినోదాన్ని పంచుతాయంటున్నారు. ఇక ఈ సినిమా పూర్తి స్ధాయి ఎంటర్టైన్ మెంట్ తో రూపొందుతోందని చెప్తున్నారు. నా అల్లుడు సినిమా తర్వాత డ్యూయల్ కాన్సెప్ట్ (ఆ సినిమాలో ఒక్కడే కనపడతాడు అయినా సినిమా అంతా ఇద్దరు ఉన్నారన్న భ్రమ కలిగిస్తారు)తో రెడి అవుతున్న చిత్రం ఇదే.దాంతో ఎన్టీఆర్ అభిమానులే కాక మిగతా వారు కూడా ఈ సినిమాను ఆసక్తితో చర్చించుకుంటున్నారు. వారి అంచనాలుకు తగ్గకుండా సినిమా తయారుఅవుతుందని ఆశిద్దాం. అక్టోబరు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కొడాలి నాని చెప్పారు. కథ-మాటలు: కోన వెంకట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: ఛోటా.కె.నాయుడు, కళ: ఆనందసాయి, ఫైట్స్: స్టన్ శివ, పాటలు: చంద్రబోస్, కూర్పు: గౌతంరాజు.