Don't Miss!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Technology Google సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ ఇతర ఫోన్లకు కూడా వస్తోంది! ఫోన్ల లిస్ట్ ఇదే!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సక్సెస్కు బంధువులు ఎక్కువ...జూ. ఎన్టీఆర్ సెటైర్
సక్సెస్కు బంధువులు ఎక్కువని, ఫెయిల్యూర్ అనాథగా మిగులుతుందని ఎన్టీఆర్ అన్నారు. అలాగే బృందావనం చిత్రంతో ఎంతో మంది బంధువులను ఏర్పరచుకున్నట్లు చెప్పారు. కాజల్, సమంత, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించిన బృందావనం సినిమా విడుదల సందర్భంగా నిర్మాత దిల్రాజుతో కలిసి గురువారం సాయంత్రం ఆర్టీసీ క్రాస్రోడ్డులో సుదర్శన్ థియేటర్లో ఫస్ట్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే తనకు బృందావనం సినిమాతో అన్ని రకాల పాత్రల్లో నటించాలనే స్వార్థం పెరిగిందని హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. క్లాస్, మాస్, ఫ్యామిలి ఎంటర్టైన్మెంటు సినిమా అని తెలిపారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తే చెప్పలేనంత సంతృప్తి కలుగుతుందన్నారు. టీమ్ వర్క్తో సక్సెస్ సాధించినట్లు చెప్పారు. ఇదే హాల్లో ఉదయం ఆటను బృందావనం దర్శకుడు వంశీ పైడితల్లి, నటుడు శ్రీహరి, హీరోయిన్ సమంత, ఛాయాగ్రహకుడు చోటాకె నాయుడు చూసారు.