Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
ఎన్టీఆర్ పక్కన ఇద్దరు ఫ్యాక్షనిస్టులు.. బాబోయ్, త్రివిక్రమ్ ఏంటి ఇలా!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రంపై ఇప్పటినుంచే అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ ఈ చిత్రం కోసం కొన్ని నెలల పాటు కష్టపడి సిక్స్ ప్యాక్ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది. వరుస విజయలతో జోరుమీదున్న ఎన్టీఆర్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. అజ్ఞాతవాసి చిత్రం తరువాత త్రివిక్రమ్ కు ఓ హిట్ కావాలి. దీనితో త్రివిక్రమ్ చిన్న అవకాశాన్ని కూడా విడిచిపెట్టకుండా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఎలాంటి కథతో రూపొందుతోంది అనే విశేషాల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ ఆసక్తి పెంచేలా తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది.
Recommended Video
చిన్న అవకాశం కూడా
ఎన్టీఆర్ తో రూపొందిస్తున్న చిత్రాన్ని ఎలాగైనా విజయవంతం చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. అందుకే అజ్ఞాతవాసి చిత్రం తరువాత ఎన్టీఆర్ సినిమా కూర్పులో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. సంగీత దర్శకుడు అనిరుద్ స్థానంలో తమన్ ని తీసుకున్నారు.
ఎన్టీఆర్ లుక్ కోసం వెయిటింగ్
ఇటీవల ఎన్టీఆర్ త్రివిక్రమ్ చిత్రం కోసం కొన్ని నెలల పాటు జిమ్ లో కసరత్తులు చేసిన సంగతి తెలిసిందే. ప్రత్యేక ట్రైనర్ సమక్షంలో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రై చేసాడు. త్రివిక్రమ్ సినిమాలోనే ఎన్టీఆర్ కొత్త లుక్ రివీల్ కానుంది.
ఎన్టీఆర్ పక్కన ఇద్దరు ఫ్యాక్షనిస్టులు
త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. జగపతి బాబు, నాగబాబు ఈ చిత్రంలో ఫ్యాక్షనిస్టులుగా కనిపిస్తారట. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న చిత్రం అంటే యాక్షన్ సన్నివేస్లు బలంగా ఉంటాయి. ఎన్టీఆర్ అభిమానులు కోరుకునేది కూడా అదే.
దసరా కానుకగా
ఈ చిత్రం దసరా కానుకగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రిసయేషన్స్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.