Don't Miss!
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Sports RR vs DC: రఫ్ఫాడించిన ఆవేశ్ ఖాన్.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన రాజస్థాన్ రాయల్స్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘మా’ ఎన్నికల తీర్పు: హైకోర్టులో సవాల్ చేసిన కళ్యాణ్
హైదరాబాద్: ‘మా' ఎన్నికలను రద్దు చేయాలంటూ కోర్టుకెక్కిన నటుడు ఓ. కళ్యాణ్కు సిటీ సివిల్ కోర్టులో ఎదురు దెబ్బతగిలిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అతనికి రూ. 10 వేల రూపాయల జరిమానా కూడా విధించింది కోర్టు. ఈ తీర్పుపై ఓ.కళ్యాణ్ స్పందిస్తూ మా ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి, సిటీ సివిల్ కోర్టు తీర్పును హై కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు. ఆయన చెప్పిన విధంగా గురువారం సిటీ సివిల్ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసారు కళ్యాణ్.
కళ్యాణ్ పిటీషన్ కొట్టి వేయడంతో పాటు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల ఫిలితాలు విడుదలకు కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు సాయంత్రంగానీ, శుక్రవారం గానీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.
తాజాగా ఓ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో.....ఫలితాలు వెలువడతాయా? లేక ఆపాలంటూ హై కోర్టు నుండి ఏమైనా ఆదేశాలు వస్తాయా? అనేది చర్చనీయాంశం అయింది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి జయసుధ, రాజేంద్రప్రసాద్ లలో గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మా ఎన్నికల ఫలితాల పైన సిటీ సివిల్ కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పడంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది. అయితే ఓ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించడంతో మా ఎన్నికల వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఎన్నికల ఫలితాలు విడుదల పైన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఫలితాలు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చునని సిటీ సివిల్ కోర్టు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. మరి హై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.