twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జగపతి బాబు-కళ్యాణి ‘ఓ మనిషి కథ’ ఆడియో

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: జగపతి బాబు -కళ్యాణి ల సూపర్ హిట్ కాంబినేషన్ లో రాధాస్వామి ఆవుల దర్శకత్వంలో బాలాభాయ్ చొవాటియా నిర్మించిన చిత్రం ''ఓ మనిషి కథ ''. బుధవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ఆడియో విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, విజయ్ భాస్కర, సంగీత దర్శకులు విజయ్ కురాకుల, దర్శక నిర్మాతలు రాధాస్వామి, బాలాభాయ్ తదితరులు హాజరయ్యారు. ఆదిత్య ద్వారా మార్కెట్ లోకి విడుదలైన ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తామని అన్నారు దర్శక నిర్మాతలు.

    O Manishi Katha audio launch

    ఒక మనిషి జీవితంలోని సమస్యలను, ఎదుర్కోవడానికి ఆ మనిషి పడే ఆరాటాన్ని దర్శకుడు అద్బుతంగా తెరకెక్కించారని వక్తలే పేర్కొన్నారు. ఎమోషనల్‌ సీన్స్‌లో జగపతిబాబు పలికించిన హవభావాలు చాల బాగున్నాయి. కళ్యాణి గృహణిగా బాగా నటించింది. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చిపెడుతుంది అన్నారు.

    ముఖ్యంగా జగపతి బాబు నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం ఈ చిత్రానికి ఆయువుపట్టుగటా నిలుస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోగల సత్తా ఉన్న చిత్రమిది అన్నారు.

    English summary
    'O Manishi Katha' movie audio released at Parasad Labs, Hyderabad. Jagapathi Babu and Kalyani play Lead Roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X