తిరుపతిలోనే బాహుబలి ఆడియో వేడుక, ఇదిగో ఏర్పాట్లు (ఫోటో)
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘బాహుబలి' ఆడియో లాంచ్ తేదీ, వేదిక ఖరారైంది. ఈ చిత్ర ఆడియో వేడుక తిరుపతిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 13న తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్లో ఈ వేడుక ప్లాన్ చేసారు.
వాస్తవానికి ఈ ఆడియో వేడుక మే 31న హైదరాబాద్ లోని హైటెక్స్ ఓపెన్ గ్రౌండ్స్లో జరుగాల్సి ఉంది. గతంలో జరిగిన కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా ఆడియో వేడుకకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆడియో వేడుక వాయిదా వేసి అభిమానులకు కారణం వివరించి క్షమాపణలు చెప్పారు రాజమౌళి, ప్రభాస్.

చివరకు తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీ గ్రౌండ్స్ లో ఆడియో వేడుక ప్లాన్ చేసారు. ఈ మేరకు తిరుపతి ఎస్పీ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లభించడంతో గ్రౌండ్ లో చిన్న పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ పూజలో రాజమౌళి తనయుడితో పాటు నిర్మాత ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు.

‘బాహుబలి' ఆడియో వేడుకలో ఎలాంటి సమస్య ఏర్పడకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ‘బాహుబలి' ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. సినిమా హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా ఉందనే ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇదో గొప్ప చిత్రం. 250 కోట్ల ఖర్చుతో...రెండు భాగాలుగా తెరకెక్కుతోది. తొలి భాగం జులై 10న ‘బాహుబలి - ది బిగినింగ్' పేరుతో తెరకెక్కుతుంది. రెండో భాగం 2016లో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











