Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఖచ్చితంగా హిట్ అన్న నమ్మకంతో ఉన్నారు: కొరటాల మహేష్ లలోనూ అదే కాన్ఫిడెన్స్
ఎప్పుడెప్పుడా అని మహేష్ అభిమానులు ఎదురుచూస్తున్న కబురు రానే వచ్చింది. మహేశ్ తాజా సినిమా విడుదల తేదీ ఖరారైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాత దానయ్య డీవీవీ నిర్ణయించారు. సూపర్ స్టార్ మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న భరత్ అను నేను సినిమా అసలైతే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు. కాని సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా చేశారు. డివివి ఆర్ట్స్ పతాకంలో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 27న రిలీజ్ అని ట్విట్టర్ పేజ్ లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.
Recommended Video
శ్రీమంతుడు లాంటి హిట్
శ్రీమంతుడు తర్వాత కొరటాల శివతో మహేష్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సిఎంగా నటిస్తున్నాడు. కచ్చితంగా ఈ ఇద్దరు మళ్లీ శ్రీమంతుడు లాంటి హిట్ కొడతాడని అంటున్నారు. మహేష్ బాబు - ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ల కాంబోలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన స్పైడర్ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించని సంగతి తెలిసిందే.
భరత్ అనే నేను
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మహేష్ అభిమానులను నిరుత్సాహపరిచింది. దీంతో కొరటాల శివ - మహేష్ ల కాంబోలో రాబోతున్న భరత్ అను నేను చిత్రంపై ప్రిన్స్ అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. స్పైడర్ ప్రమోషన్ పూర్తయిన వెంటనే మహేష్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అసెంబ్లీ నేపథ్యంలో జరిగే అత్యంత కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే.
సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ నిర్మిస్తోంది. డి.పద్మావతి సమర్పిస్తున్నారు. ‘శ్రీమంతుడు' తర్వాత మహేశ్ - కొరటాల శివ కాంబినేషన్లో వస్తోన్న చిత్రమిది. హైదరాబాద్లో రూపొందించిన ప్రత్యేకమైన సీఎం క్యాంప్ ఆఫీస్ సెట్లో ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్స్టాప్గా జరగనుంది.
నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ ‘నవంబర్ 7 వరకు హైదరాబాద్ షెడ్యూల్ జరుగుతుంది. నవంబర్ 22 నుంచి ఔట్ డోర్ షెడ్యూల్ నాన్స్టాప్గా జరుగుతుంది. మహేష్, కొరటాల శివ కాంబినేషన్లో మా బేనర్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహేష్ కెరీర్లో ఇది మరో పవర్ఫుల్ మూవీ. అలాగే మా బేనర్లో మరో బిగ్గెస్ట్ హిట్ సినిమా అవుతుంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న సమ్మర్ స్పెషల్గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.
ఏప్రిల్ 27 న విడుదల
స్పైడర్ తో నిరాశచెందిన అభిమానులను అలరించేందుకు భరత్ ను త్వరగా విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత దానయ్య ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను వచ్చే వేసవి కానుకగా ఏప్రిల్ 27 న విడుదల చేయబోతున్నారని పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ విషయాన్ని చిత్ర యూనిట్ కన్ ఫర్మ్ చేసింది.
కైరా అద్వాని
సమ్మర్ సినిమాల రేసులో భరత్ ను నిలుపుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్నఈ సినిమాలో మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. కొరటాల-మహేష్ ల కాంబోలో వచ్చిన శ్రీమంతుడు తరహాలోనే 'భరత్ అను నేను' భారీ విజయాన్ని అందిస్తుందని ప్రిన్స్ అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మరోసారి ప్రేక్షకుల అంచనాలను కొరటాల అందుకుంటాడేమో వేచి చూడాలి.