twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం, రహమాన్, నిత్యా మీనన్ ఒకే వేదికపై..(ఫొటో ఫీచర్)

    By Srikanya
    |

    హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నిత్యమేనన్‌, సల్మాన్‌ దుల్కర్‌ జంటగా నటించిన చిత్రం 'ఓకే బంగారం'. ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆడియో సక్సెస్‌మీట్‌ను హైద్రాబాద్‌లోని తాజ్‌డెక్కన్‌లో నిర్వహించారు.

    ఈ కార్యక్రమానికి దర్శకుడు మణిరత్నం, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీత దర్శకుడు రెహమాన్‌, హీరో నాని, హీరోయిన్‌ నిత్య మేనన్‌, నటుడు ప్రకాష్‌ రాజ్‌, నిర్మాత దిల్‌రాజ్‌ హాజరై మాట్లాడారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    వాళ్లేం మాట్లాడారు అనేది స్లైడ్ షోలో చూడండి.

    దిల్ రాజు మాట్లాడుతూ...

    దిల్ రాజు మాట్లాడుతూ...

    ఓకే బంగారం సినిమా...మణిరత్నంగారు తీస్తున్నప్పటినుంచీ చాలా ఎక్సైటింగ్ స్టార్టైంది. దానికి మా అన్నయ్య ప్రకాష్ రాజ్ గారు ...తెలుగులో చేయటానికి మద్రాస్ టాకీస్ మణిరత్నం గారితోనూ, అందరితోనూ మాట్లాడి సినిమా నాకు ఇప్పించారు. ఒక ఆడియన్ గా ..నేను టీనేజ్ లో ఉన్నప్పుడు గీతాంజలి చిత్రం 12 సార్లు చూసాను. మీ సఖి సినిమాను నైజాం ను డిస్ట్రిబ్యూన్ చేసాను.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను..సినిమా చూసాను..బ్యూటిఫుల్ సినిమా ఇచ్చారు చాలా సంతోషం అన్నారు.

    సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతూ...

    సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతూ...

    మణిరత్నం, ఎఆర్ రహమాన్, నిత్యామీనన్, ప్రకాష్ రాజ్ ..వీళ్ల నలుగురు కీ ఓ ప్రత్యేకత ఉంది. వీళ్లని తెలుగు వారు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు. ఈ రోజున ఓకే బంగారం అనే డబ్బింగ్ సినిమా తాలుకు పాటలు రిలీజ్ అవటం లేదు.. స్ట్రైయిట్ తెలుగు పాటలే రిలీజ్ అవుతున్నాయి అన్నారు.

    హీరో నాని మాట్లాడుతూ....

    హీరో నాని మాట్లాడుతూ....

    నేనే ఈ సినిమాకు ఫస్ట్ ఆడియన్ ని. సినిమా చూసిన వెంటనే దిల్ రాజు గారికి ఫోన్ చేసి చెప్పాను. చాలా భయంకరమైన కుళ్లు వచ్చేసింది. ఈ సినిమాలో నేనే హీరోగా చేస్తే..దుల్కర్ మళయాళంలో డబ్బింగ్ చెప్తే బాగుండేది అనిపించింది అన్నారు.

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

    ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ...

    ఆయన నాకు ఇష్టం...వ్యక్తిగా..ప్రొడ్యూసర్ రిలేషన్ కాదు. జీవితంలో ఇద్దరు కలిసి ప్రయాణం చెయ్యాలంటే ఆయన ఆలోచనలు కలవాలి. అలాంటి ఓపెన్ హార్ట్ నాకు నచ్చుతుంది. ఓకే బంగారం...గురించి చెప్పాలంటే మణి సార్ కు నాకు ఓ గొప్ప జర్నీ జరిగింది. రోజా చేసాను. ఎప్పుడో ఓ పెద్ద నటుడు అవ్వాలి అనుకుని కలలు కనేటప్పుడు...మణి సార్ ద్వారా ...నిజమైంది. నేను నిన్ను నమ్నుతున్నాను...నీ నుంచి ఇంకా చేయగలవు అనే నమ్మకం ఉంది అని చేయించుకునే వారు.
    నిత్యామీనన్ మాట్లాడుతూ...

    నిత్యామీనన్ మాట్లాడుతూ...

    ఓ కమిట్ మెంట్ తో ఇద్దరం కలిసి చేసాము....ఇది ఓ నైస్ లుకింగ్ ఫిల్మ్. ఓ క్రియేటివ్ పర్శన్ గా నన్ను మూవ్ చేసింది.

    మణిరత్నం మాట్లాడుతూ...

    మణిరత్నం మాట్లాడుతూ...

    ప్రతీ సారి... నెక్ట్స్ టైమ్ తెలుగులో మాట్లాడుతాను అని చెప్తాను.. అందుకే ఈ సారి...ఫుల్ స్పీచ్ తో వచ్చాను. కానీ...మరింతగా ప్రాక్టీస్ చేసుకుని వస్తాను... సీతారామ శాస్త్రిగారుతో చేయటం చాలా గ్రేట్ గా ఫీలవుతునున్నాను.. రహమాన్ సంగీతం కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుందని అన్నారు. బంగారం ని దిల్ రాజు చేతిలో పెట్టాను. ఆయనే కేర్ తీసుకుంటారు. నిత్యా,దుల్కర్ వెరీ టాలెంటెండ్ పీపుల్.

     ఎఆర్ రహమాన్ మాట్లాడుతూ...

    ఎఆర్ రహమాన్ మాట్లాడుతూ...

    తెలుగు తెలుసు కానీ ...కరెక్టు తెలుగు మాట్లాడలేను..అర్దం చేసుకోగలను. మణి గారు ఓ మెంటర్, బ్రదర్ అన్నీ నాకు. ఓకే బంగారం..పాటలు వెరీ వెరీ స్పెషల్. ఆడియన్స్ అందరికీ ధాంక్స్ అన్నారు.

    కెమెరా వర్క్ హైలెట్

    కెమెరా వర్క్ హైలెట్

    ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం.

    English summary
    Maniratnam is now coming up with the movie “Ok Bangaram”. This film has Malayalam hero Dulquer Salman and Nitya Menon in the leads. Now its audio success meet held at hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X