Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హిట్ ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’రీమేక్ వివరాలు
ఈ సందర్భంగా సునీల్కుమార్రెడ్డి మాట్లాడుతూ -వివిధ ప్రాంతాలకు చెందిన యువతను మేల్కొలుపే ఉద్దేశంతో తమ సినిమా అనువాద కార్యక్రమం చేపడుతున్నట్లు దర్శకుడు అంటున్నాడు. ప్రత్యేకంగా టెన్త్ ,ఇంటర్మీడియట్ గర్ల్స్ ను విజ్ఞానవంతులు చేస్తామని సునీల్ పేర్కొన్నాడు.ఇప్పటివరకూ మా సంస్థలో వచ్చిన అన్ని సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాతో తొలిసారిగా బాక్సాఫీస్ విజయాన్ని కైవసం చేసుకోగలిగాం.
ఇక ఒక చిన్న సినిమా 24 కేంద్రాల్లో 50 రోజులు ఆడటమనేది మామూలు విషయం కాదు. త్వరలోనే సినీ ప్రముఖుల సమక్షంలో అర్ధశతదినోత్సవం జరుపబోతున్నాం. టీనేజీ సెక్స్, అబార్షన్ల పై తెరకెక్కించిన ఈ సినిమాలో నిత్యం కనిపించే సంఘటనలనే చూపాను అన్నారు. డిజిక్వెస్ట్ ఇండియా సమర్పణలో, శ్రావ్య ఫిలింస్ పతాకంపెై తెరకెక్కింది. ఊరిని నమ్మినవారి కోసం 'సొంత ఊరు', గంగను నమ్మినవారి బతుకులపెై 'గంగపుత్రులు' తీశాను. మన ఉనికే చచ్చిపోతుంది అని చెప్పడానికి 'ఒక రొమాంటిక్ క్రైమ్ కథ'ను తెరకెక్కించాను అని చెప్పారు.