Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
‘ఒక్క క్షణం’ ఆలోచిస్తే!
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వలన మనం జీవితంలో ఏం కోల్పోతున్నామో సోదాహరణంగా తెలియజెబుతూ సందేశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రం 'ఒక్కక్షణం". సెవెన్ హిల్స్ టెలినెట్వర్క్స్ పతాకంపై కొడాలి వెంకటేశ్వర రావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెట 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్సాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర నిర్మాతలు, దర్శకుడితో పాటు.ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సౌత్ ఇండియన్ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పి. కళ్యాణ్, వడ్లపట్ల మోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ 'అలజడి" లాంటి వైవిధ్యమైన సినిమాను నిర్మించిన కొడాలి వెంకటేశ్వర రావు తొలిసారిగా 'ఒక్క క్షణం" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన ఆలోచనా సరళి మొదట్నుంచి వైవిధ్యంగా వుంటుంది అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ 'ఒక్క క్షణం" ఆలోచిస్తే మంచి జరుగుతుంది అనే కాన్సెప్ట్ ను ఒకటిన్నర గంటలో అద్బుతంగా చూపించారు. సదుద్దేశ్యంతో రూపొందించిన ఈ చిత్రం ఎకరికైనా చూపించడానికి సిద్దంగా వున్నాను. ఈ చిత్రాన్ని తామంతా చూసామని మంచి సినిమాలు రావడంలేదని బాధపడేవాళ్లంతా చూసి తీరాల్సిన చిత్రమిదని ఈ సందర్బంగా వారంతా అభిప్రాయ పడ్డారు. రాజీవ్ కనకాల, అహుతి ప్రసాద్, తెలంగాణ శకుంతల, జీవ, ఎల్ బి శ్రీరామ్ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోసిస్తున్నారు.