Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేడు... ఆ గంభీరమైన గొంతు ఇక వినిపించదు
బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు.
బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ లో విలక్షణమైన గొంతుతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన66 ఏళ్ల ఓం పురి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. హిందీ సినిమాల ద్వారా పాపులర్ అయిన ఓం.. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించారు. పాకిస్తాని హాలివుఇద్ సినిమాల్లోనూ నటించిన ఓంపురీ లేకపోవటం భారతీయ సినిమాకు తీరని లోటే.
బాలీవుడ్లో ఓంపురిని అభిమానించని వారంటూ ఉండరు. ఒక్క బాలీవుడ్ ఏంటి... భారతదేశం గర్వించదగ్గ నటుడు ఓంపురి. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు.. రివార్డులిచ్చి సత్కరించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఓంపురి అభిమానులుండే ఉంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క మ్యూజియం వేదికయింది. అతని నటనకు ప్రాధాన్యం ఇచ్చి సత్కరించింది. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఓంపురి ఒకరు. జాతీయస్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు ఆ విషయాన్ని ఘనంగా చాటుతాయి.ఓం పురి గతంలో రేవతి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా "అంకురం" సినిమాలో అద్భుత నటనని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు.