Don't Miss!
- News అమిత్ షా ఓ గూండా, రౌడీ, అయినా పక్కనే పెట్టుకున్న ప్రధాని మోదీ, సీఎం కొడుకు సంచలనం!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేడు... ఆ గంభీరమైన గొంతు ఇక వినిపించదు
బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు.
బాలీవుడ్ నటుడు ఓం పురి ఇకలేరు. 66 ఏళ్ళ నట ధిగ్గజం ఈ తెల్లవారుఝామున గుండెపోటుతో మరణించారు. బాలీవుడ్ లో విలక్షణమైన గొంతుతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన66 ఏళ్ల ఓం పురి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. హిందీ సినిమాల ద్వారా పాపులర్ అయిన ఓం.. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించారు. పాకిస్తాని హాలివుఇద్ సినిమాల్లోనూ నటించిన ఓంపురీ లేకపోవటం భారతీయ సినిమాకు తీరని లోటే.
బాలీవుడ్లో ఓంపురిని అభిమానించని వారంటూ ఉండరు. ఒక్క బాలీవుడ్ ఏంటి... భారతదేశం గర్వించదగ్గ నటుడు ఓంపురి. అందుకే ఆయన్ను ఎన్నో అవార్డులు.. రివార్డులిచ్చి సత్కరించారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా ఓంపురి అభిమానులుండే ఉంటారు. అలాంటి నటుడికి ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క మ్యూజియం వేదికయింది. అతని నటనకు ప్రాధాన్యం ఇచ్చి సత్కరించింది. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఓంపురి ఒకరు. జాతీయస్థాయిలో ఆయన అందుకున్న అవార్డులు ఆ విషయాన్ని ఘనంగా చాటుతాయి.ఓం పురి గతంలో రేవతి ప్రధాన పాత్ర పోషించిన తెలుగు సినిమా "అంకురం" సినిమాలో అద్భుత నటనని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు.