Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్షమించండి, నీచంగా మాట్లాడాను: నటుడు ఓంపురి కన్నీరు
హైదరాబాద్: బాలీవుడ్ సీనియర్ నటుడు ఓంపురి తన వివాదాస్పద కామెంట్లతో ఇటీవల విమర్శల పాలైన సంగతి తెలిసిందే. దేశ రక్షణలో నిత్యం తమ ప్రాణాలను పణంగా పెట్టే సైనికుల ఉద్దేశించి అతడు చేసిన కామెంట్స్ దేశ పౌరులందరికీ ఆగ్రహం తెప్పించింది.
యూరి ఘటన తర్వాత ఓంపురి ఓ ఇంటర్వ్యూలో సైనికుల గురించి మాట్లాడుతూ వారిని ఆర్మీలో ఎవరు చేరమన్నారు, ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు.. అంటూ చేసిన దిగజారుడు వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
తన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో....తన ప్రవర్త ఎంత పెద్ద తప్పో తెలుసుకున్న ఆయన వెంటనే తన కామెంట్స్ ను వెనక్కి తీసుకోవడంతో క్షమాపణలు చెప్పారు. తాజాగా ఆయన తన 66వ పుట్టినరోజు సందర్భంగా బారాముల్లా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ జవాను నితిన్ యాదవ్ ఇంటికి వెళ్లి భావోద్వేగాని గురై కంటతడి పెట్లారు.
ప్రస్తుతం నితిన్ యాదవ్ కుటుంబం కాన్పూర్ ఉండటంతో అక్కడికి వెళ్లిన ఓంపురి జవాన్ కుటుంబీకులను పరామర్శించారు. ప్రార్థన కార్యక్రమం పూర్తయిన తర్వాత ఓంపురి కన్నీరుమున్నీరవుతూ తాను సైనికులను ఉద్దేశించి చాలా తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలిన మరోసారి వేడుకున్నారు.