Don't Miss!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
ఆ దర్శకుడి కోసం బి.గోపాల్ సినిమాను మరోసారి వాయిదా వేసిన బాలయ్య..?
ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించడానికి చాలానే ఇబ్బందులు పడుతున్నాడు.బాలకృష్ణకు నరసింహా నాయుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కూడా సినిమా సెట్టవ్వడం లేదు. రచయిత సాయి మాధవ్ బుర్ర సహకారంతో కథ సెట్ చేసుకున్నప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.
త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఊహించని విధంగా కరోనా దెబ్బ పడింది. ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సినిమాను మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్నాథ్ చెప్పిన కొత్త కథ నచ్చడంతో ఆ సినిమాను తొందరగా ఫినిష్ చేసి బి.గోపాల్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఎందుకంటే పూరి జగన్నాథ్ షూటింగ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. వీలైనంత వేగంగా సినిమాను ఫినిష్ చేయడానికి సిద్ధపడతారు. ఇక బి.గోపాల్ సినిమా బిగ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిదానంగా పూర్తి చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బి.గోపాల్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఊహించని విధంగా వాయిదా వేయడంతో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.