Don't Miss!
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
ఆ దర్శకుడి కోసం బి.గోపాల్ సినిమాను మరోసారి వాయిదా వేసిన బాలయ్య..?
ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించడానికి చాలానే ఇబ్బందులు పడుతున్నాడు.బాలకృష్ణకు నరసింహా నాయుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కూడా సినిమా సెట్టవ్వడం లేదు. రచయిత సాయి మాధవ్ బుర్ర సహకారంతో కథ సెట్ చేసుకున్నప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.
త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఊహించని విధంగా కరోనా దెబ్బ పడింది. ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సినిమాను మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్నాథ్ చెప్పిన కొత్త కథ నచ్చడంతో ఆ సినిమాను తొందరగా ఫినిష్ చేసి బి.గోపాల్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఎందుకంటే పూరి జగన్నాథ్ షూటింగ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. వీలైనంత వేగంగా సినిమాను ఫినిష్ చేయడానికి సిద్ధపడతారు. ఇక బి.గోపాల్ సినిమా బిగ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిదానంగా పూర్తి చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బి.గోపాల్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఊహించని విధంగా వాయిదా వేయడంతో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.