Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ దర్శకుడి కోసం బి.గోపాల్ సినిమాను మరోసారి వాయిదా వేసిన బాలయ్య..?
ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించడానికి చాలానే ఇబ్బందులు పడుతున్నాడు.బాలకృష్ణకు నరసింహా నాయుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కూడా సినిమా సెట్టవ్వడం లేదు. రచయిత సాయి మాధవ్ బుర్ర సహకారంతో కథ సెట్ చేసుకున్నప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.
త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఊహించని విధంగా కరోనా దెబ్బ పడింది. ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సినిమాను మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్నాథ్ చెప్పిన కొత్త కథ నచ్చడంతో ఆ సినిమాను తొందరగా ఫినిష్ చేసి బి.గోపాల్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఎందుకంటే పూరి జగన్నాథ్ షూటింగ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. వీలైనంత వేగంగా సినిమాను ఫినిష్ చేయడానికి సిద్ధపడతారు. ఇక బి.గోపాల్ సినిమా బిగ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిదానంగా పూర్తి చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బి.గోపాల్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఊహించని విధంగా వాయిదా వేయడంతో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.