Don't Miss!
- News రెండో రోజు నామినేషన్ల జోరు: 69 నామినేషన్లు వేసిన 57 మంది అభ్యర్థులు, ప్రముఖులు వీరే
- Sports ధోనీ ట్రేడ్మార్క్ సిక్సర్..101 మీటర్ల దూరం Video
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ దర్శకుడి కోసం బి.గోపాల్ సినిమాను మరోసారి వాయిదా వేసిన బాలయ్య..?
ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ ప్రస్తుతం మరో సినిమాను తెరకెక్కించడానికి చాలానే ఇబ్బందులు పడుతున్నాడు.బాలకృష్ణకు నరసింహా నాయుడు లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చినప్పటికీ ఆయనతో కూడా సినిమా సెట్టవ్వడం లేదు. రచయిత సాయి మాధవ్ బుర్ర సహకారంతో కథ సెట్ చేసుకున్నప్పటికి ఇంకా ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.
త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్న తరుణంలో ఊహించని విధంగా కరోనా దెబ్బ పడింది. ఇకపోతే ఇప్పుడు బాలకృష్ణ బి.గోపాల్ సినిమాను మళ్ళీ వాయిదా వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల పూరి జగన్నాథ్ చెప్పిన కొత్త కథ నచ్చడంతో ఆ సినిమాను తొందరగా ఫినిష్ చేసి బి.గోపాల్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట.
ఎందుకంటే పూరి జగన్నాథ్ షూటింగ్ ఫినిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోరు. వీలైనంత వేగంగా సినిమాను ఫినిష్ చేయడానికి సిద్ధపడతారు. ఇక బి.గోపాల్ సినిమా బిగ్ బడ్జెట్ లో ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కాస్త నిదానంగా పూర్తి చేయాలని కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను బి.గోపాల్ ఇప్పటికే పూర్తి చేసినట్లు సమాచారం. ఇక బాలయ్య ఊహించని విధంగా వాయిదా వేయడంతో సందిగ్ధంలో పడ్డట్లు తెలుస్తోంది.