Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహానటి డిలీటెడ్ సీన్: రాజేంద్ర ప్రసాద్ అలా చేసేసరికి కెవ్వుమని అరుస్తున్న కీర్తి!
మహానటి చిత్రం విడుదలై దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది. లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మహానటిగా సావిత్రి దక్షిణాదిలో చెరగని ముద్ర వేసింది. ఆమె పాత్రలో నటించడం కత్తిమీద సాములాంటి పనే. కానీ యంగ్ హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిందనే ప్రశంసలు దక్కుతున్నాయి.
విడుదల తరువాత కూడా చిత్ర యూనిట్ చేస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలు వసూళ్లు మరింతగా పెరగడానికి కారణం అవుతున్నాయి. యుఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం దుమ్ములేపుతోంది. తాజగా చిత్రం యూనిట్ డిలీటెడ్ సీన్ పేరుతో మరో సన్నివేశాన్ని విడుదల చేశారు.
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, కీర్తి సురేష్ మధ్య సాగే ఈ సన్నివేశం చాలా సరదాగా, హాస్యభరితంగా ఉంది. కీర్తి సురేష్ భుజంపై రాజేంద్రప్రసాద్ గిల్లగానే ఆమె కెవ్వుమని అరుస్తూ పలికించే హావభావాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.