Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
లక్ష్మీస్ ఎన్టీఆర్కు మరో ఎదురుదెబ్బ.. ప్రీవ్యూ చూడలేం అని తేల్చేసిన హైకోర్టు!
అంతా ఆసక్తిగా ఎదురుచూసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రాలో విడుదల కాలేదు. తెలంగాణ, యూఎస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఆంధ్ర హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సంగతి తెలిసిందే. కోర్టు సమస్యలు తీరాక ఈ చిత్రం ఆంధ్రాలో కూడా విడుదల కానుంది. తెలంగాణాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల ఆంధ్రాలో మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఈ చిత్రంపై విచారణని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరోమారు వాయిదా వేయడంతో చిత్ర యూనిట్ కు నిరాశ తప్పలేదు.
చివరి నిమిషంలో
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం కూడా అడ్డు చెప్పలేదు. కానీ టిడిపి నేతలు ఈ చిత్ర విడుదలని అడ్డుకునేందుకు చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. మార్చి 29 న ఈ చిత్రం విడుదల ఖాయం అనుకుంటున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ పై స్టే విధించింది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ చేస్తున్న ప్రయత్నాలు అంతగా ఫలించడం లేదు.
మరోసారి నిరాశ
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించిన సమయంలో ఏప్రిల్ 3న ఈ చిత్రాన్ని చూసి తీర్పు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. ఈ లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. త్వరగా తన పిటిషన్ పై విచారణ జరపాలని రాకేష్ రెడ్డి సుప్రీంని కోరగా.. అంత తొందరేంటి అని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ పిటిషన్ సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.
ప్రివ్యూ చూడలేం
నేడు
ఆంధ్ర
హైకోర్టు
లక్ష్మీస్
ఎన్టీఆర్
చిత్రాన్ని
చూసి
విడుదలపై
ఏదో
ఒక
నిర్ణయాన్ని
ప్రకటిస్తుందని
అంతా
భావించారు.
కానీ
హై
కోర్టు
లక్ష్మీస్
ఎన్టీఆర్
చిత్ర
యూనిట్
ని
నిరాశాని
కలిగించేలా
వ్యాఖ్యలు
చేసింది.
ఈ
కేసు
సుప్రీం
కోర్టులో
పెండింగ్
లో
ఉంది
కాబట్టి
మేము
ప్రివ్యూ
చూడలేం
అని
కోర్టు
తెలిపింది.
తదుపరి
విచారణని
ఏప్రిల్
9కి
వాయిదా
వేస్తున్నట్లు
ప్రకటించారు.
దీనితో
లక్ష్మీస్
ఎన్టీఆర్
చిత్రం
ఎన్నికలకన్నా
ముందు
విడుదలవుతుందా
అనే
అనుమానాలు
కలుగుతున్నాయి.
ఏప్రిల్
11న
ఆంధ్రప్రదేశ్
లో
ఎన్నికలు
జరగనున్న
సంగతి
తెలిసిందే.
మోడీకి గ్రీన్ సిగ్నల్
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై స్టే విధించడంపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించాడు. ప్రధాని మోడీ బయోపిక్ చిత్రం పీఎం నరేంద్ర మోడీ చిత్రాన్ని ఉదహరిస్తూ.. పీఎం నరేంద్ర మోడీ చిత్రానికి బాంబే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని తెలియజేశాడు. సెన్సార్ సభ్యులు ఒకే చేసిన చిత్రాన్ని అడ్డుకోవడం కుదరదని ఎన్నికల సంఘం కూడా తెలిపింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మాత్రమే ఈ ఆంక్షలు ఏంటి అంటూ వర్మ ప్రశ్నించాడు.