Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ఒకే ఒక్క ఫైట్ తో నాగ్ 'లవ్స్టోరీ'సుఖాంతం
నాగార్జున, దశరధ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'లవ్స్టోరీ'. నయనతార హీరోయిన్ గా చేసిన ఈ చిత్రంలో ఒకే ఒక్క ఫైట్ చోటు చేసుకోనుందని సమాచారం. ఒక్క ఫైట్ తోనే కథ సుఖాంతానికి వస్తుందని, నో యాక్షన్ అని చెప్తున్నారు. గతంలో వచ్చిన సంతోషంలో ఒక్క పైటూ లేదు..ఈ సారి ఒకే ఒక్క ఫైట్ తో ప్యూర్ గా రొమాంటిక్ యాంగిల్ లో దశరధ్ ఈ కథ రెడీ చేసారని చెప్తున్నారు.
దర్శకుడు దశరధ్ మాట్లాడుతూ...దేవదాసు కాలం నుంచి ప్రేమకథలు చూస్తూనే ఉన్నాం. ప్రతీసారీ ఓ కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు దర్శకులు. వెండి తెరపై ఆహ్లాదం పంచిన ప్రేమ కథకే ప్రేక్షకులూ ఓటేస్తున్నారు. మా ప్రేమ కథలోనూ ఆ కొత్తదనం కనిపిస్తుంది అన్నారు.''యువతరాన్ని ఆకట్టుకొనే ప్రేమకథలకే విజయాలు దక్కాయి. మా సినిమాలో కూడా వారికి నచ్చే అంశాలున్నాయి. నాగార్జున ఆహార్యం కొత్తగా అనిపిస్తుంది. దశరథ్ ఈ కథను మలుస్తున్న విధానం బాగుంది. కుటుంబ బంధాలకూ చోటుంది. తమన్ సంగీతం అందరినీ అలరిస్తుంది''అన్నారు నిర్మాత.
ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా 'బంగారం' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసిన మీరాచోప్రా ని ఎంపిక చేసారు. ఆమె బంగారం తర్వాత 'వాన', 'జగన్మోహిని' చిత్లాల్లో నటించినా బ్రేక్ రాలేదు. అంతేగాక గత ఏడాది 'మారో' ద్వారా మరోసారి తెలుగు తెరపై కనిపించారామె. ఆ తర్వాత ఈ బ్యూటీ తెలుగు సినిమాలు అంగీకరించలేదు. ఇక సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టేసినట్లేనని కొంతమంది చెప్పుకున్నారు. అందం, అభినయం ఉన్న మీరా సినిమాలకు ఎందుకు ఫుల్స్టాప్ పెట్టాల్సి వచ్చిందని కూడా చర్చించుకున్నవారు ఉన్నారు.
తాజాగా 'లవ్స్టోరి'తో మళ్లీ తెలుగులో చేస్తోంది. ఈ రీల్ 'లవ్స్టోరి'కి నాయకుడు నాగార్జున. 'సంతోషం' తర్వాత నాగార్జున హీరోగా దశరథ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఇందులో నయనతార ప్రధాన కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీరా కూడా ఉన్నారు. నాగ్ సరికొత్త లుక్లో కనిపించబోతున్న ఈ చిత్రంలో మీరా ఒక అద్భుతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు తెలుగులో తను చేసిన మూడు చిత్రాలు బ్రేక్ ఇవ్వలేకపోయాయి. ఈ చిత్రం ఆ కొరతని తీర్చే విధంగా ఉంటుందని చెప్తున్నారు. కామాక్షి మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని చందన్రెడ్డి నిర్మిస్తున్నారు.